ప్రముఖ నిర్మాత MS రాజు దర్శకత్వంలో సీనియర్ నటుడు నరేష్, పవిత్ర లోకేష్ జంటగా తెరకెక్కిన సినిమా మళ్ళీ పెళ్లి. నటుడు నరేశ్ జీవితంలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిందని మూవీ ట్రైలర్ చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. రిలీజ్ కు ముందే మంచి బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమా మే 26 శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి సినిమా ఎలా ఉంది, ఆడియన్స్ ను ఏమేరకు మెప్పించింది అనేది తెల్సుకుందాం.
భార్య సౌమ్య వల్ల వైవాహిక జీవితం కుదుపుల మయం అవుతుంది. పైకి నవ్వుతున్నా.. లోలోపల ఎన్నో బాధలు మోస్తుంటాడు. తొలిసారి సెట్లో పార్వతి (పవిత్ర లోకేష్)ని చూడగానే ఓ స్వాంతన కలుగుతుంది. తనకు సోల్ మేట్ దొరికినట్టు అనిపిస్తుంది.
పార్వతి ఓ నటి. తనకు పెళ్లయి ఇద్దరు పిల్లలుంటారు. తాను కూడా నరేంద్ర కంపెనీని ఇష్టపడుతుంది. పార్వతి వైవాహిక జీవితం సంతోషంగా ఉందని గ్రహించిన నరేంద్ర.. ఆమెని ఏ రూపంలోనూ డిస్ట్రబ్ చేయకూడదనుకొంటాడు. పార్వతి కూడా నరేంద్రతో బంధం.. స్నేహం వరకే పరిమితం చేయాలనుకొంటుంది.
కానీ… వీరిద్దరి జీవితంలో కొన్ని ఊహించని ఘటనలు ఎదురవుతాయి. ఓరోజు.. పార్వతి నుంచి నరేంద్రకు ఓ మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్లో ఏముంది? పార్వతి గురించి నరేంద్రకు తెలిసిన నిజాలేంటి? సౌమ్య వల్ల.. నరేంద్ర ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు? అనేది మిగిలిన కథ.
ప్రస్తుతం జనరేషన్ లో చాలామంది ఎదుర్కొంటున్న సమస్యని చాలా బాగా చూపించారని కామెంట్స్ చేస్తున్నారు. ఇక కొందరేమో సినిమా యావరేజ్ గా ఉందని, నరేష్, పవిత్ర కాకుండా వేరే వాళ్ళు యాక్ట్ చేసుంటే బాగుండేదని చెప్తున్నారు.