తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖంగా వినిపించే ఫ్యామిలీల్లో దగ్గుబాటి ప్యామిలీ పేరు ఒకటి. దివంగత రామా నాయుడు, నిర్మాతగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సృష్టించైనా సంగతి తెలిసిందే. ఆయన తనయుల్లో సురేష్ బాబు నిర్మాతగా, మరో తనయుడు విక్టరీ వెంకటేష్గా అగ్ర హీరోగా ఎదిగారు. ఇప్పుడు దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి మూడో తరం వచ్చేసింది. సురేష్ బాబు తనయుల్లో మొదటి వాడైన రానా దగ్గుబాటి పాన్ ఇండియా యాక్టర్గా గుర్తింపు సంపాదించుకున్నారు. సురేష్ బాబు రెండో తనయుడు దగ్గుబాటి అభిరాం సినీ ఎంట్రీకి సంబంధించి ఎప్పటి నుంచో వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.
ఎట్టకేలకు ఇప్పుడు అభిరామ్ సినీ రంగ ప్రవేశానికి సంబంధించిన ప్రకటన వెలువడింది. అభిరామ్ను హీరోగా తెలుగు తెరకు పరిచయం చేయబోయేది…. సీనియర్ డైరెక్టర్ తేజ. ఆయన ‘అహింస’ పేరుతో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో అభిరామ్ దగ్గుబాటి హీరోగా చేస్తున్నారు. మంగళ వారం తేజ పుట్టిన రోజు న ‘అహింస’ ప్రీ లుక్ను విడుదల చేశారు. ఉదయ్కిరణ్, నితిన్ వంటి హీరోలకు ఎందరికో కెరీర్ బెస్ట్ హిట్స్ ఇచ్చిన ఘనత తేజా సొంతం. అయితే ఇప్పుడు దగ్గుబాటి చిన్నోడు అభిరామ్ ఎంట్రీ బాధ్యతను తీసుకున్నారు మన తేజ. ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్ పతాకంపై అహింస సినిమా రూపొందుతోంది. పి.కిరణ్ ఈ సినిమాకు నిర్మాత.
‘అహింస’ ప్రీ లుక్ను గమనిస్తే.. హీరో ముఖం మీద గోనె సంచె, పెదాల నుంచి కారుతున్న రక్తం అంతకు మించి ఇంకేదో విషయాన్ని కన్వే చేస్తోందని తెలుస్తుంది. టైటిల్కీ, లుక్కీ సంబంధం లేనట్టు, హై యాక్షన్ మూవీ అన్నట్టు చెప్పనే చెబుతోంది చిత్ర యూనిట్. ఈ చిత్రానికి ఆర్.పి.పట్నాయక్ సంగీతాన్ని అందించడం విశేషం. తేజ -ఆర్.పి.పట్నాయక్ కాంబోలోని మ్యూజికల్ హిట్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు . చాలా సంవత్సరాల తర్వాత వీరిద్దరూ కలిసి చేస్తున్న సినిమా . మరో ఆసక్తికరమైన విషయమేమంటే.. ‘అహింస’ చిత్రీకరణను సైలెంట్గా పూర్తి చేసేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటిస్తారని సమాచారం. విషయం తెలిసిన తర్వాత సురేష్ బాబు మామూలోడు కాదు అంటున్నారు అందరు.. ప్లానింగ్ ప్రకారం సైలెంట్గా అభిరామ్ సినిమాను పూర్తి చేసేసి రిలీజ్కు సిద్ధం చేసేస్తున్నాడని సినీ సర్కిల్స్లో టాక్ వినిపిస్తోంది.