అక్కినేని ఫ్యామిలీ నుంచి కింగ్ నాగార్జున నట వారసులుగా నాగ చైతన్య, అఖిల్ ఇండస్ట్రీలోకి ఇప్పటికే అడుగుపెట్టారు. ఇక నాగ చైతన్య యంగ్ హీరోలలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని సొంతం చేసుకొని దూసుకుపోతున్నాడు. అయితే చైతూ తమ్ముడు అఖిల్ మాత్రం ఇప్పటి వరకు సరైన హిట్ లేకుండా కెరియర్ ని కొనసాగిస్తున్నాడు. ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ గా పాన్ ఇండియా రేంజ్ లో ఎంటర్టైన్ చేయడానికి రెడీ అయ్యాడు. యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమామీద అఖిల్ చాలా నమ్మకాలు పెట్టుకున్నాడు. ఇదిలా ఉంటే నాగ చైతన్య తాజాగా విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో థాంక్యూ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. అయితే ఈ మూవీ డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకొని చైతూ కెరియర్ లో మరో బిగ్గెస్ట్ ఫ్లాప్ గా మారిపోయింది.
ఇక అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా సినిమాతో మరో సారి చైతూ ప్రేక్షకులని అలరించడానికి రెడీ అవుతున్నాడు. ఇదిలా ఉంటే ఈ సినిమాల తర్వాత అక్కినేని సోదరులు ఇద్దరూ కలిసి ఒక మల్టీ స్టారర్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తుంది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చి తరువాత బ్రహ్మోత్సవం లాంటి డిజాస్టర్ తో కొంత కాలం కనుమరుగైన దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. మరల గత ఏడాది నారప్ప సినిమాతో ఈ దర్శకుడు లైమ్ లైట్ లోకి వచ్చాడు. ఈ సినిమా హిట్ టాక్ సొంతం చేసుకున్న రీమేక్ కేటగిరీలోకి వెళ్లడం. తమిళ్ మూవీని మక్కీకి మక్కీ దించేయడం వలన శ్రీకాంత్ కి ఎలాంటి క్రెడిట్ రాలేదు.
ఇక గత కొద్ది రోజులుగా తన సొంత కథ మీద ఈ దర్శకుడు వర్క్ చేస్తున్నాడు. గీతా ఆర్ట్స్ ప్రొడక్షన్ లో ఈ సినిమా ఉండే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ఈ సినిమాని మల్టీ స్టారర్ చిత్రంగా ప్లాన్ చేసి అక్కినేని సోదరులతో తెరకెక్కించడానికి ఈ దర్శకుడు సిద్ధం అయినట్లు తెలుస్తుంది. త్వరలో దీనికి సంబందించిన అధికారిక సమాచారం వచ్చే అవకాశం ఉన్నట్లు టాలీవుడ్ లో వినిపిస్తున్న టాక్.