అనుపమ పరమేశ్వరన్.. మన పక్కింటి అమ్మాయిలా ఉంటూ తెలుగు ప్రేక్షకుల మదిలో తనదైన స్థానాన్ని దక్కించుకున్న మలయాళి ముద్దుగుమ్మ. ఈ అమ్మడు కమ్యూనికేషన్ ఇంగ్లీష్ డిగ్రీ చదువుకోడానికి వెళుతున్న సమయంలో సినిమా ఆడిషన్ జరుగుతుందని తెలిసి, ఓ ప్రయత్నం చేద్దామని వెళితే, హీరోయిన్గా అవకాశం వచ్చింది. తర్వాత వరుస అవకాశాలు రావడంతో డిగ్రీని మధ్యలోనే ఆపేసింది. సినిమాల్లో నటిస్తూ తన డిగ్రీని పూర్తి చేసింది(Anupama Parameswaran Approach Cyber Crime)
వరుస తెలుగు సినిమాల్లో నటించిన ఈ బామ్మ కి అనుకోని షాక్ తగిలింది. అది కూడా హ్యాకింగ్ రాయుళ్ల కారణంగా. అసలు విషయమేమంటే, అనుపమ పరమేశ్వరన్ ఫేస్ బుక్ను కొన్నాళ్లు ముందు హ్యాక్ కు గురి అయ్యింది. అందులో వాళ్లు కొన్ని ఫొటోలను(Photos) మార్ఫింగ్ చేసి పోస్ట్ చేశారు. ఆ ఫొటోలను చూసి అనుపమ పరమేశ్వరన్ షాకైంది. వెంటనే సైబర్ క్రైమ్ను పోలీసులను ఆశ్రయించింది. అయితే కొందరు అనుపమను కామెంట్స్ రూపంలో ఇబ్బంది పెట్టసాగారు. అయితే ఈ కామెంట్సకు అనుపమ ఘాటుగా రియాక్ట్ కావడంతో కామెంట్స్ కాస్త ఆగిపోయాయి. ఇంతకీ ఈ విషయాన్ని చెప్పింది ఎవరో కాదు.. అనుపమనే. రీసెంట్ ఇంటర్వ్యూలో తనకు సోషల్ మీడియా హ్యాకింగ్ వల్ల కలిగిన ఇబ్బందిని వివరించింది ఈ అమ్మడు.
సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ అనుపమ యాక్టివ్గా ఉంటూ ఫొటోలను షేర్ చేస్తుంది. ఈ మలయాళీ బ్యూటీ తెలుగు ప్రేక్షకులకు త్రివిక్రమ్ మూవీ అఆ తో పరిచయమైంది. ఆ తర్వాత శతమానం భవతి, ఉన్నది ఒకటే జిందగీ, కృష్ణార్జున యుద్ధం, తేజ్ ఐ లవ్ యూ, హలో గురూ ప్రేమ కోసమే, రాక్షసుడు, రౌడీ బాయ్స్ సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. ఇప్పుడు తెలుగులో ఈమె నటించిన 18 పేజీస్ విడుదలకు సిద్ధంగా ఉంది. కార్తికేయ 2, బటర్ ఫ్లై సినిమాలు సెట్స్పై ఉన్నాయి.
ALSO READ: ఫిల్మ్ ఇండస్ట్రీ మీటింగ్కి హాజరు కాని సినీ ప్రముఖులు