మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అఆ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ జయాపజయాలతో ఓ మోస్తరు హీరోయిన్ గా రాణిస్తుంది. ఆమెతో వచ్చిన వారు స్టార్ హీరోయిన్స్ గా సక్సెస్ అయితే అనుపమ పరమేశ్వరన్ మాత్రం ఇంకా చిన్న హీరోలతో సినిమాలు చేస్తూ కెరియర్ ని నెట్టుకొస్తుంది. అందం, అభినయం ఉండి కూడా సరైన గుర్తింపు లేక వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ హీరోయిన్ గా ముందుకెళ్తుంది. శతమానం భవతి క్లాసికల్ హిట్ ని సొంతం చేసుకున్న అనుకున్న స్థాయిలో అనుపమ కెరీర్ ముందుకు సాగడం లేదు. అయితే తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన కార్తికేయ 2 ఈమె సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ మూవీ ని తన ఖాతాలో వేసుకుంది.
సినిమాలో పాత్ర పరంగా కూడా అనుపమ అద్భుతమైన రెస్పాన్స్ సొంతం చేసుకుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి వచ్చి హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో అనుపమ పరమేశ్వరన్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇప్పటివరకు ఆమెను ఐరన్ లెగ్ గా చూసిన వాళ్లు కూడా నెక్స్ట్ సినిమాలో హీరోయిన్ తనని ఖరారు చేసుకోవాలని అనుకుంటున్నారు. కార్తికేయ తర్వాత నిఖిల్ తోనే 18 పేజెస్ అనే లవ్ స్టోరీస్ లో ఈమె నటిస్తుంది. ఇదిలా ఉంటే కార్తికేయ 2 ఇచ్చిన సక్సెస్ ఆమెకి బాలీవుడ్లో గేట్లు ఓపెన్ అయ్యేలా చేసింది. ప్రస్తుతం అక్కడ ఓ పెద్ద ప్రొడక్షన్ హౌస్ తమ నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ ఫైనల్ చేసుకునే పనిలో ఉన్నట్లు తెలుస్తుంది.
దాంతో పాటు మరో ఇద్దరు, ముగ్గురు దర్శకులు తమ సినిమాల కోసం అనుపమని సంప్రదించినట్లు తెలుస్తుంది. ఇప్పటికే టాలీవుడ్ నుంచి సమంత, రష్మిక మందన బాలీవుడ్ లోకి అడుగు పెట్టిన తమ సత్తా చాటే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఈ కోవలోకి అనుపమ కూడా చేరబోతున్నట్లు తెలుస్తుంది. ఇంతవరకు బాలీవుడ్ దర్శకులు గ్లామర్ తో పాటు ఎక్కువగా నార్త్ ఇండియన్ అమ్మాయిలకి అవకాశం ఇచ్చేవారు. అయితే అక్కడ ప్రేక్షకులు టేస్ట్ మారడంతో సౌత్ ఇండియా అమ్మాయిలని హీరోయిన్స్ గా తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ నేపధ్యంలో సౌత్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ కొనసాగుతున్న వారిని బాలీవుడ్ లోకి లాంచ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరి అనుపమ పరమేశ్వరన్ బాలీవుడ్ స్క్రీన్ పై ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుంది అనేది వేచి చూడాలి.