YSRCP: ఏపీ రాజకీయాలలో వైసీపీ వెంట మెజారిటీ ప్రజలు ఉన్నారనేది రాజకీయ వర్గాలలో వినిపించే మాట. దీనికి కారణం ఉంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాజ్యాధికార విభజన విషయంలో అన్ని వర్గాలకి సమాన ప్రాతినిధ్యం ఇస్తారు. అలాగే అన్ని వర్గాలని కలుపుకొని వెళ్తారు. టీడీపీ గతంలో ఆర్ధిక బలాలు చూసుకొని నియోజకవర్గాలలో ఎమ్మెల్యే సీట్లు కేటాయిస్తూ వచ్చేది. ఈ కారణంగా సామాజిక న్యాయం ఎప్పుడూ జరగలేదు. అయితే జగన్ ఎమ్మెల్యే అభ్యర్ధుల ప్రకటనతో సామాజిక న్యాయం కరెక్ట్ గా అమలు చేసారనేది చాలా మంది చెప్పీ మాట. చాలా చోట్ల ఎమ్మెల్యే అభ్యర్ధులుగా గెలిచిన నాయకులు బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల నుంచి వచ్చినవారే ఉంటారు.
ఆయా నియోజకవర్గాలలో ఆర్ధికంగా బలంగా ఉన్న అభ్యర్ధులు ఉన్నా కూడా సామాజిక సమీకరణాలు బేస్ చేసుకొని స్థానాలు కల్పించారు. ఇది కూడా ఆ పార్టీ గెలుపులో కీలకం అయ్యింది. అలాగే ప్రస్తుతం చేపడుతున్న సంక్షేమ పథకాలు అన్ని కూడా ఎక్కువగా వెనుకబడిన తరగతులని దృష్టిలో ఉంచుకొని చేపడుతున్నారు. ఈ పథకాలలో ఎక్కువ లబ్ది దారులు ఎవరంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకి చెందివారే కావడం విశేషం.
అలాగే మంత్రి వర్గ విస్తరణలో కూడా సామాజిక సమీకరణాల ఆధారంగానే ఇచ్చారు. తనకి అత్యంత ఆప్తులు వైసీపీలో ఉన్న, మొదటి నుంచి తన వెంట నడిచిన వారిని సైతం పక్కన పెట్టి సామాజిక సమీకరణలలో భాగంగా మంత్రి పదవులు ఇచ్చారు. ఈ విధంగా వారిని రాజ్యాధికారానికి దగ్గర చేసారని చెప్పాలి. ఈ లెక్కన టీడీపీ, జనసేన చెప్పే సామాజిక మార్పు అనేది ఇప్పటికే వైసీపీ అమలు పెట్టి చూపించింది. మరి అందుకే మెజారిటీ ప్రజలు వైసీపీ వెంట నిలబడుతున్నారు అనేది జగమెరిగిన సత్యం అని చెప్పాలి.