Brain Eating Amoeba : థాయ్లాండ్ నుండి తిరిగి వచ్చిన ఒక దక్షిణ కొరియా వ్యక్తి నేగ్లేరియా ఫౌలెరి వల్ల కలిగే ఇన్ఫెక్షన్తో మరణించాడు. ఇది సాధారణంగా వెచ్చని మంచినీటి వనరులలో కనిపించే మెదడు తినే అమీబా. దక్షిణ కొరియా కు చెందిన 50 ఏళ్ల వ్యక్తి గత నాలుగు నెలలుగా థాయ్లాండ్లో ఉన్నాడు. ఈమధ్యనే డిసెంబరు 10న కొరియాలోకి ప్రవేశించాడని కొరియా డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ఏజెన్సీ తన నివేదికలో పేర్కొంది.
థాయ్లాండ్ నుంచి వచ్చిన సాయంత్రమే ఇన్ఫెక్షన్ లక్షణాలు కనిపించాయి . తలనొప్పి, జ్వరం, వాంతులు, అస్పష్టమైన ప్రసంగం , మెడ దృఢత్వాన్ని కోల్పోవాడం వంటి లక్షణాలతో ఇబ్బందులు పడ్డాడు . 11 రోజుల తరువాత అతను మరణించాడు. పోస్ట్మార్టం తర్వాత మరణానికి గల కారణాలను నిర్ధారించారు. దేశంలో నేగ్లేరియా ఫౌలెరి ఇన్ఫెక్షన్ యొక్క మొట్ట మొదటగా ధృవీకరించబడిన కేసు ఇదేనని కొరియన్ టైమ్స్ పేర్కొంది.
యునైటెడ్ స్టేట్స్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం, నేగ్లేరియా ఫౌలెరి అనేది అమీబా , ఇది మెదడులో ఇన్ఫెక్షన్లకు కారణమవుతుంది. ఇది మట్టి, సరస్సులు, నదులు, వెచ్చని మంచినీటి వనరులలో కనిపిస్తుంది. ఈ నెగ్లేరియా ఫౌలెరి వల్ల వచ్చే వ్యాధిని ప్రైమరీ అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ గా సూచిస్తారు, ఇది ప్రాణాంతకమైనదిగా పరిగణించబడుతుంది. 1962 నుండి 2021 వరకు యునైటెడ్ స్టేట్స్లోని 154 మందిలో నలుగురు మాత్రమే ఇన్ఫెక్షన్ బారిన పడిన తర్వాత కోలుకుని బయటపడ్డారని నివేదికలు చెబుతున్నాయి.
ఈ ఇన్ఫెక్షన్ మీ ప్రారంభ దశల్లో గుర్తించడం కష్టం ఎందుకంటే ఇది వేగంగా వ్యాపిస్తుంది శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. రోగి మరణించిన తర్వాతే దీనిని గుర్తించవచ్చంటున్నారు. ఈ వ్యాధికి రెండు లక్షణాలు ఉన్నాయి . రోగులు మొదటి దశలో తీవ్రమైన తలనొప్పి , జ్వరం, వికారం , వాంతుల లక్షణాలు కనిపిస్తాయి , రెండవ దశలో మానసిక స్థితిలో మార్పు కనిపిస్తుంది. ఈ ఇన్ఫెక్షన్ తీవ్రమైన సందర్భాల్లో, రోగి కోమాలోకి కూడా వెళ్లే ప్రమాదం ఉంది.
CDC ప్రకారం, ప్రస్తుతం నేగ్లేరియా ఫౌలెరి ఇన్ఫెక్షన్ మనిషి నుండి మనిషికి సంక్రమించినట్లు ఎటువంటి ఆధారాలు లేవు. ఇది నీటి ఆవిరి లేదా ఏరోసోల్ బిందువుల ద్వారా కూడా వ్యాపించదు. ప్రస్తుతం ఈ ఇన్ఫెక్షన్ కు వ్యాక్సిన్ లేదు, అయితే వ్యాధిని ఆంఫోటెరిసిన్ B, అజిత్రోమైసిన్, ఫ్లూకోనజోల్, రిఫాంపిన్, మిల్టెఫోసిన్ , డెక్సామెథాసోన్ వంటి మెడిసిన్ కాంబినేషన్స్ తో చికిత్స చేయవచ్చు.