బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏపీ రాజకీయాలలో అడుగుపెట్టారు. ఏకంగా ముగ్గురు ప్రధాన నాయకులు ఏపీ నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్ ని అధికారికంగా కన్ఫర్మ్ చేశారు. ఇక రావేల కిషోర్ బాబుని ఢిల్లీ కేంద్రంగా బీఆర్ఎస్ పార్టీ బాధ్యతలని అప్పగించారు. పార్ధసారధి సీనియర్ నాయకుడుగా పార్టీలో కీలక హోదాని ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. మరికొందరు క్రింది స్థాయి నాయకులు, అలాగే ఉద్యమ సంఘాలు నడుపుతున్న వారు బీఆర్ఎస్ లో చేరారు. త్వరలో మరికొంత మంది కీలక నేతలు, అధికార, ప్రతిపక్షాల నుంచి బీఆర్ఎస్ లో చేరడానికి సిద్ధంగా ఉన్నారని కేసీఆర్ చెప్పుకొచ్చారు. తెలంగాణ తరహాలో సంక్షేమ పాలనని ఏపీకి అందించే దిశగా తన అడుగులు పడతాయని అన్నారు.
స్వచ్చమైన రాజకీయం ఏపీలో తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటా అని తెలిపారు. అలాగే విశాఖ ఉక్కుని తాము అధికారంలోకి వచ్చిన వెంటనే మళ్ళీ జాతికి అంకితం చేస్తామని తెలిపారు. ఇక విశాఖ లేదంటే విజయవాడ వేదికగా త్వరలో భారీ బహిరంగ సభ నిర్వహించడానికి సిద్ధం అవుతున్నారు. ఇక ఏపీలో చంద్రబాబు రాజకీయ దోస్త్ టీడీపీని దెబ్బ తీసే దిశగా తన రాజకీయ కార్యాచరణ మొదలుపెట్టిన నేపధ్యంలో తెలంగాణలో టీడీపీ ఎలాంటి వ్యూహంతో వెళ్తుంది అనేదానిపై చర్చ నడుస్తుంది. ఇప్పటికే చంద్రబాబు ఖమ్మం వేదికంగా బహిరంగ సభ నిర్వహించి తెలంగాణలో టీడీపీ బలంగా ఉందని చూపించే ప్రయత్నం మొదలు పెట్టారు. అప్పుడు బీఆర్ఎస్ పార్టీ నేతలు విమర్శలు చేశారు.
అయితే బీఆర్ఎస్ ఏపీలోకి అడుగుపెట్టిన నేపధ్యంలో చంద్రబాబుపై ఎదురుదాడి చేసే ఛాన్స్ వారికి దొరకదు. టీఆర్ఎస్ లో ఉన్న చాలా మంది బలమైన నాయకులతో పాటు క్యాడర్ కూడా టీడీపీ నుంచి వలస వెళ్ళినవారే. ఈ నేపధ్యంలో చంద్రబాబు ఇప్పుడు తన క్యాడర్ తో పాటు టీడీపీ నుంచి వెళ్ళిన కొంత బలమైన నాయకులని మళ్ళీ సొంత గూటికి ఆహ్వాహించారు. ఈ దిశగానే ఖమ్మంలో తుమ్మల నాగేశ్వరరావు లాంటి నేతలు అప్పుడే తన రాజకీయం మొదలు పెట్టారు. త్వరలో హైదరాబాద్ వేదికంగా తిరిగి పార్టీలోకి రాబోతున్న నాయకులని గ్రాండ్ గా ఆహ్వానించే కార్యక్రమం చంద్రబాబు నిర్వహించడానికి రెడీ అవుతున్నట్లు రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది. బీఆర్ఎస్ ఏపీలో ఎంత వేగంగా వెళ్తే తెలంగాణలో కేసీఆర్ ని దెబ్బ కొట్టే వ్యూహాలతో బాబు అలాగే వెళ్తారని రాజకీయ విశ్లేషకులు అంటున్న మాట.
Advertisement