China : చైనా లో కరోనా విజృంభిస్తుంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి భయానకంగా మారింది. ప్రజలు బిక్కుబిక్కు మంటూ ప్రాణాలను అర చేతిలో పెట్టుకొని బతుకుతున్నారు. కేవలం 20 రోజుల్లోనే అక్కడ 25 కోట్ల కోవిడ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ విషయాన్ని చైనాలోని స్థానిక న్యూస్ పేపర్స్ ప్రకటించాయి. తాజాగా జరిగిన హెల్త్ కమిషన్ సమావేశంలోని ముఖ్య అంశాలను పత్రికలు ప్రజలకు తెలిపాయి. దీనినిబట్టి ప్రస్తుతం చైనాలో పరిస్థితి ఏమిటో ఊహించుకోండంటూ చెప్పకనే చెప్పాయి. ప్రస్తుతం చైనా సోషల్ మీడియాలో ఈ వార్త చెక్కర్లు కొడుతుంది.
ప్రస్తుతం చర జనాభా 140 కోట్ల పైగానే ఉంది ఇందులో 25 కోట్ల మందికి కరోనా సోకినట్లు తాజా గా తెలుస్తోంది. డిసెంబర్ నెలలో 20 రోజులుల్లోనే 18 శాతం కేసులు నమోదయ్యాయి. అయితే ఈ విషయాన్ని ఇంకా చైనా అధికారికంగా ప్రకటించలేదు. కొన్ని మీడియా సంస్థలు మాత్రమే వార్తను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నాయి . చైనా నేషనల్ హెల్త్ కమిషన్ డిప్యూటీ డైరెక్టర్ సూనియాగా అంచనాల ప్రకారం దేశంలో కోవిడ్ కేసుల రేటు ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
అయితే చైనా లో 80 ఏళ్ల పైబడిన వారిలో బూస్టర్ డోస్ తీసుకున్న వారి సంఖ్య 42 శాతమే ఉందని తెలుస్తోంది. సిటీలోనే కాదు గ్రామస్థాయిలో కూడా కోవిడ్ వ్యాప్తి మొదలైంది. కోవిడ్ సోకిన రోగులతో స్థానిక హాస్పిటల్ కిక్కిరిసిపోతున్నాయి. రారు రాను కోవిడి కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇక అధికారికంగా కేసుల సంఖ్యను ప్రకటించబోమని నేషనల్ హెల్త్ కమిషన్ పేర్కొంది.
కోవిడ్-19 గణనీయమైన పెరుగుదలతో చైనాలోని వివిధ ప్రాంతాలు , నగరాల్లోని ఆసుపత్రులలో రక్త కొరత ఏర్పడుతోంది. ఇది దేశ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ పని తీరును తేటతెల్లం చేస్తోంది. బ్లూమ్బెర్గ్ పత్రిక ప్రకారం, చైనాలో రెండవ అత్యధిక జనాభా కలిగిన షాన్డాంగ్ ప్రావిన్స్ బ్లడ్ సెంటర్, ఇటీవలి రోజుల్లో రెండు బ్లడ్ గ్రూప్స్ కొరత కోసం రెడ్ అలర్ట్ హెచ్చరికలను జారీ చేసింది. ఈ సంఘటన తర్వాత, అన్హుయ్ తూర్పు ప్రావిన్స్లోని సుజౌ ఆరోగ్య కమిషన్ డిసెంబర్ 20న తన వెబ్సైట్లో స్వచ్ఛంద రక్త దాన పరిస్థితికి పిలుపునిస్తూ అధికారిక ప్రకటనను విడుదల చేసింది.