Chiranjeevi – Puri Jagannath : డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సినిమా అంటే అందరి చూపూ అటు వైపే ఉంటుంది. అలాంటిది మెగాస్టార్ చిరంజీవితో సినిమా అంటే.. ఇక ఆ సందడి గురించి చెప్పనక్కర్లేదు. ఒక్కసారి ఈ కాంబోలో సినిమా అనగానే అభిమానుల్లో ఉత్సాహం రెండింతలైంది. గతంలో వీరిద్దరి కాంబోకి సంబంధించి వార్తలొచ్చి ఉసూరుమనిపించాయి. వీరిద్దరి కాంబోకి సంబంధించి ‘ఆటోజానీ’ అనే టైటిల్ కూడా వైరల్ అయ్యింది. ఆ తరువాత సినిమా లేదు.. వార్తలూ లేవు. మళ్లీ ఇప్పుడు మెగాస్టార్, పూరి కాంబో గురించి ప్రచారం మొదలైంది. అసలు నిజానికి అన్నీ అనుకున్నట్టుగా గనక జరిగి ఉంటే మెగా 150గా ఇదే ప్రాజెక్ట్ వచ్చి ఉండేది.
కాగా.. ఫస్టాఫ్ కథ బాగుంది గానీ, సెకండాఫ్ మాత్రం మెగాస్టార్కు అంతగా నచ్చలేదని అందుకే ఆ ప్రాజెక్ట్ ఆగిపోయిందని పూరి తెలిపారు. అయితే తాజాగా మరోసారి వీరిద్దరి కాంబోపై టాక్ రావడానికి కారణం లేకపోలేదు. ఈ మధ్య మెగాస్టార్తో.. పూరి బాగా టచ్లో ఉంటూ వస్తున్నారట. ఈ క్రమంలోనే పూరి, విజయ్ దేవరకొండ కాంబోలో తెరకెక్కిన ‘లైగర్’ మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్కు కూడా ముఖ్య అతిథిగా మెగాస్టార్ను ఆహ్వానించేందుకు పూరి ప్లాన్ చేస్తున్నారని టాక్. ప్రస్తుతం మెగాస్టార్ నటిస్తున్న ‘గాడ్ ఫాదర్’ సినిమాలో పూరి గెస్ట్ రోల్ చేస్తున్నారు. ఈ సమయంలో వీరిద్దరి మధ్య మరోసారి ‘ఆటోజానీ’ సినిమా ప్రస్తావన వచ్చినట్టు తాజాగా ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Chiranjeevi – Puri Jagannath : మెగా అభిమానుల్లో కొత్త ఆశలు..
ఈ క్రమంలోనే మెగాస్టార్ను మెప్పించేందుకు పూరి తన కథలో మార్పులు చేర్పులు చేశారని టాక్. మొత్తానికి వీరిద్దరి కాంబోకి సంబంధించిన న్యూస్ మళ్లీ బయటకు రావడంతో ‘ఆటోజానీ’ ప్రాజెక్ట్పై మెగా అభిమానుల్లో కొత్త ఆశలు మొదలయ్యాయని సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతోంది. ఇప్పటి వరకూ పూరి ఒక్క మెగాస్టార్ మినహా దాదాపు మెగా హీరోలందరినీ డైరెక్ట్ చేశారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ని ‘చిరుత’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం చేసిందే పూరి కావడం విశేషం. అలాగే పవన్ కళ్యాణ్తో.. ‘బద్రి’, ‘కెమెరా మేన్ గంగతో రాబాబు’, అల్లు అర్జున్తో ‘దేశముదురు’, వరుణ్ తేజ్తో ‘లోఫర్’ సినిమాలు చేశారు. ఇక మెగాస్టార్తో చేయడమే తరువాయి అని టాక్ వినిపిస్తోంది.