చావు అంచుల వరకు వెళ్లి ప్రాణాలతో బయటపడిన వారు ఎవరైన కొన్ని గంటల పాటు ఇంకా అదే షాక్ లో ఉంటారు. ప్రాణాలు పోయాయని అనుకుంటారు. చావంటే ప్రతి ఒక్కరికి అంత భయం ఉంటుంది. ఆ చావుని జయించడం అంటే ఏదో అద్బుతం సాధించిన అనుభూతి కలుగుతుంది. అయితే కొంత మంది మాత్రం చావైన, బ్రతుకైన ఒకేలా తీసుకుంటారు. చావు వస్తుందన్న పెద్దగా భయపడరు. అలాగే చావు నుంచి బయటపడితే మాత్రం ఆ ఆనంద క్షణాలని వెంటనే ఆశ్వాదిస్తారు. విదేశీయులు ఈ రకమైన ఆలోచన దృక్పథంలో ఎక్కువగా ఉంటారు. కొంత మంది చావుని సమీపించే ముందు కూడా సెల్ఫీలు తీసుకుంటారు. కొంత మంది చావుని జయించి బయటకొచ్చిన మరుక్షణం వాటిని అందరితో పంచుకోవాలని అనుకుంటారు.
ఇక్కడ ఇప్పుడు రెండో రకం జంట గురించి చెప్పుకోవాలి. పెరూ రాజధాని లిమాలోని విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లో విమానం రన్వేపై కుప్పకూలిపోయింది. అక్కడే ఉన్న అగ్నిమాపక వాహనాన్ని ఢీకొని విమానంలో మంటలు చెలరేగాయి. అయితే క్షణాల్లోనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది విమానంకి అంటుకున్న మంటలని కంట్రోల్ చేశారు. అదే సమయంలో విమానంలో ఉన్న ప్రయాణికులు కూడా సురక్షితంగా బయటకి తీసుకొచ్చారు.
అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో సిబ్బంది తోపాటు, దాదాపు 120 మంది ప్రయాణికులు ఉండగా, ఎవరికి ఏమీ కాలేదు. అయితే అ విమాన ప్రమాదం నుంచి బయటపడిన ఒక జంట వెంటనే అక్కడి నుంచి తాము ఫ్లైట్ ఆక్సిడెంట్ కి గురై ప్రాణాలతో బయటపడినట్లు సెల్ఫీ తీసుకున్నారు. దీనిని ఏ 320 సిస్టమ్స్ అనే ఫేస్ బుక్ పేజీలో సెల్ఫీ ఆఫ్ ది ఇయర్ అనే క్యాప్సన్ తో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఆ ఫోటో కాస్తా వైరల్ అవుతుంది. ఇలాంటి ప్రాణ సంకటం కూడా సెల్ఫీలు తీసుకునే ధైర్యం చేయడం నిజంగా గొప్ప విషయం అని నెటిజన్లు కామెంట్స్ చేస్తూ ఉండగా, ఆ క్షణాలు లైఫ్ లో గుర్తుండిపోవాలని సెల్ఫీ తీసుకున్నట్లు ఆ జంట చెప్పుకొచ్చింది.