Surya పాన్ ఇండియా సినిమాలు ఈ మధ్య ఎక్కువైపోతున్నాయి. ఏ డైరెక్టర్ చూసినా పాన్ ఇండియా సినిమాలవైపే అడుగులు వేస్తున్నారు. తాజాగా తమిళ్, మలయాళం స్టార్లతో కలిసి ఓ లేడీ డైరెక్టర్ పాన్ ఇండయా సినిమా ప్లాన్ చేస్తోంది. దీంతో అందరి దృష్టీ పాన్ ఇండియా మల్టీ స్టారర్ వైపే మళ్లింది.
పాన్ ఇండియా లెవల్లో సినిమాలు ఈ మధ్య కామన్ అయిపోయాయి. అందుకే ప్రతి డైరెక్టర్ తన సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నారు. తాజాగా డైరెక్టర్ సుధ కొంగర ఓ పాన్ ఇండియా సినిమా చేయడానికి రెడీ అయ్యారట. అదెవ్వరితోనో కాదు స్టార్ హీరో సూర్య, మరో కథానాయకుడు దుల్కర్ సల్మాన్తో. ఈ ఇద్దరు హీరోలతో మల్టీ స్టారర్ ప్లాన్ చేశారంట దర్శకురాలు సుధ కొంగర. దీంతో ఈ సినిమా గురించే ఇప్పుడు పాన్ ఇండియా లెవల్లో చర్చ నడుస్తోంది.
డైరెక్టర్ సుధ కొంగర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గురు సినిమాతో వెంకటేష్తో చేసిన ప్రాజెక్ట్ మంచి టాక్ సొంతం చేసుకుంది. ఇక ఆకాశం నీ హద్దురా అంటూ సూర్యతో చేసిన సినిమా లాక్డౌన్లో మంచి హిట్ సాధించింది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ ఆడియన్స్ కి దగ్గరయ్యారు డైరెక్టర్ సుధ. తాజాగా ఈమె సూర్య, దుల్కర్ సల్మాన్ తో కలిసి సినిమా చేస్తుండటంతో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. పైగా ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో ఉంటుందని క్లారిటీ వచ్చేసింది.
హీరో సూర్య తమిళ్ ఇండస్ట్రీ అయితే, దుల్కర్ సల్మాన్ మలయాళం స్టార్. వీరిద్దరిని కలుపుతూ మల్టీ స్టారర్ చేయడమంటే మామూలు సాహసం కాదు. ఇటు సూర్య సినిమాల గురించి చెప్పక్కర్లేదు. సినిమా సినిమాకు ఎంతో వ్యత్యాసం చూపిస్తూ విభిన్నమైన కథలు ఎంచుకుంటారు సూర్య. ఇక దుల్ఖర్ సల్మాన్ సైతం యూత్లో మంచి క్రేజ్ ఉన్న హీరో. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా తీస్తున్న సంస్థ కన్నడీకులకు చెందిన హంబలే. ఈ సంస్థ నుంచి ఇప్పటికే కేజీఎఫ్ , కేజీఎఫ్ 2 లాంటి పాన్ ఇండియా సినిమాలు రిలీజయ్యాయి.
ఇక ప్రభాస్ చేస్తున్న సలార్ సినిమా కూడా ఇదే హంబలే ప్రొడక్షన్ కంపెనీ నుండే వస్తోంది. భారీ పాన్ ఇండియా సినిమాలే ఈ ప్రొడక్షన్ నుండి రిలీజ్ అవుతున్నాయి. దీంతో డైరెక్టర్ సుధ కొంగర తీయబోతున్న తమిళ్, మలయాళం హీరోల మల్టీస్టారర్ ఎలా ఉండబోతోందన్న అన్న దానిపై ఇప్పటికే దేశ వ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ఇద్దరు హీరోలతో వస్తున్న పాన్ ఇండియా కాంబోపై ఇటు అభిమానులతో పాటు సినీ వర్గాలు సైతం ఆసక్తిగా ఉన్నాయి.