Deepika Pilli : టిక్ టాక్ పుణ్యమాని చాలా మంది ఫేమస్ అయ్యారు. చాలా మంది టిక్టాక్ యాప్ ద్వారా తమ టాలెంట్తో ఆకట్టుకున్నారు. అలా టిక్ టాక్తో జనం నోళ్ళలో నానుతూ పాపులర్ అయిన వారిలో దీపికా పిల్లి ఒకరు. టిక్టాప్ యాప్ ద్వారానే ఆమె ‘ఢీ’ షోలో ఛాన్స్ కొట్టేశారు. ఈ టీవీ వంటి ప్రతిష్టాత్మక సంస్థలో ఈ ఆఫర్ రావడంతో దీపికా క్రేజ్ ఒక్కసారిగా రెట్టింపయ్యింది. ఇక అమ్మడు ఆగుతుందా? సోషల్ మీడియాని ఫుల్గా వాడేస్తూ తన క్రేజ్ను పెంచుకుంటూ వెళుతోంది. ఇంటర్నెట్లో దీపికా చేసే రచ్చ అంతా ఇంతా అని చెప్పలేం. నాటు స్టెప్పులతో అదగొడుతోంది. పొట్టి పొట్టి దుస్తులేసుకుని యూత్కి బాగా కనెక్ట్ అయిపోతోంది. మొత్తానికి దీపిక తనలోని మరో కోణాన్ని బయటపెట్టింది.
Deepika Pilli : మయూరిలా డ్యాన్స్ చేసిన దీపిక
టీవీ షోస్తో సోలో యాంకరింగ్ ఒక పక్క.. స్పెషల్ ఈవెంట్స్ హోస్ట్ చేస్తూ మరో పక్క దీపికా పిల్లి సూపర్ ఫామ్లో ఉంది. దీంతో గ్లామర్కి పెద్ద పీట వేస్తూ స్టార్ యాంకర్స్ రేంజ్కి ఎదిగిన రష్మీ గౌతమ్ అనసూయను త్వరలోనే బీట్ చేస్తుందనే టాక్ కూడా నడుస్తోంది. తాజాగా అమ్మడు ఇన్స్టా గ్రాంలో షేర్ చేసిన ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. నేచర్ను తెగ ఎంజాయ్ చేస్తూ మయూరిలా డ్యాన్స్ చేసింది.‘వాతావరణం డిమాండ్ చేస్తోంది’ అంటూ అమ్మడు డ్యాన్స్ చేసింది. ‘మెరిసింది మేఘం.. మేఘం..’ సాంగ్కు క్లైమేట్ను ఎంజాయ్ చేస్తూ స్టెప్పులు ఇరగదీసింది. అమ్మడి డ్యాన్స్ చూసిన నెటిజన్లు కామెట్ల వర్షం కురిపిస్తున్నారు. లైకులతో సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు.
మొత్తానికి అమ్మడి క్రేజ్ ఓ సినిమాలో హీరోయిన్ను కూడా చేసింది. దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు పర్యవేక్షణలో శ్రీధర్ సీపాణ తెరకెక్కించిన ‘వాంటెడ్ పండు గాడు’ అనే సినిమాలో దీపిక పిల్లి ఓ హీరోయిన్గా నటించింది. ఈ సినిమా విషయమై రాఘవేంద్రరావు మాట్లాడుతూ.. ఈ బ్యూటీ ఈ సినిమాతో స్టార్ అవుతుందని తేల్చి చెప్పారు. అమ్మడి అందాన్ని ఆకాశానికి ఎత్తారు. అవకాశాలకు కొదువ ఉండదని తల్చి చెప్పారు. ఇటీవలే ఈ చిత్ర ట్రైలర్ విడుదలై మంచి రెస్పాన్స్నే పొందింది.