తోటి విద్యార్థుల చేతిలో దెబ్బలు తిని వస్తుంది దేవి. అది చూసి ఫీల్ అయిన రాధ కూతురిని అన్ని కష్టాలు తట్టుకునేలా చేయాలని.. ధైర్యం కోసం దేవిని కరాటే ట్రైనింగ్ లో చేర్పిస్తుంది. ఆ తర్వాత రాధ ఇంటికి వచ్చేసరికి భాగ్యమ్మ అక్కడ ఉంటుంది. అమ్మని ఇప్పుడు వచ్చావు ఏంది కంగారుగా అడుగుతుంది రాధ. ఆమె అత్త దేవుడమ్మ వచ్చి రాధ గురించి ఆరా తీసినట్లు చెబుతుంది. ఆ తర్వాత ఆగస్ట్ 2న ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం..
‘దేవుడమ్మ తల్లికి నువ్వు నన్ను కలిసినవేమో అని అనుమానం వచ్చింది. అందుకే మస్తు బాధపడుతూ నీ గురించి అడిగింది. ఆ బాధ చూడలేకపోతున్న ఏదైతే అది అయితది. మీ అత్తమ్మ దగ్గరకి పోదామా పదా బిడ్డ’ అని బాధగా అంటుంది భాగ్యమ్మ. ‘ఏం మాట్లాడుతున్నవమ్మా నేను ఇప్పుడు అక్కడికి వచ్చి సత్య కాపురంలో నిప్పులు పోయమంటావా. నా చెల్లి కోసమే ఇదంతా చేశాను.. ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నానో చెప్పి దాని జీవితాన్ని నాశనం చేయొద్దు. నువ్వు నా మాట వినకపోతే ఇక్కడి నుంచి వెళ్లిపోయి జిందగిలో ఎవరికి కనిపించను’ అని చాలా ఎమోషనల్ గా అంటుంది రాధ. ‘అట్ట అనకు బిడ్డ.. నువ్వు చెప్పినట్టే వింటా’ అని భయంగా అంటుంది భాగ్యమ్మ. దేవి పరిస్థితి విని.. స్కూల్ దగ్గర పండ్లు అమ్మేటిది బంద్ చేసి.. నీ తానికి రమ్మంటావా అంటుంది భాగ్యమ్మ. ‘ఏం మాట్లాడుతున్నావే.. నువ్వు నా తానికి వచ్చేస్తే నువ్వు ఎవరు అంటే.. ఈ ఇంట్లో వాళ్లకి నేను ఏం చెప్పాలి. అదేం వద్దు మిమ్మల్ని చూడాలి అనిపిస్తే నేనే మీ దగ్గరకి వస్తా అంటుంది’ రాధ కంగారుగా. ‘పని మనిషిని అని చెప్పు బిడ్డా.. నేను ఎవరికి చేస్తాను.. నీకు నా మనవరాలికే కదా.. సేవలు చేసేది.. పని మనిషి లెక్కనైనా నీ తానా ఉంటాను’ అంటుంది భాగ్యమ్మ. రాధ వద్దంటున్నా వినకుండా ఆమె దగ్గరికి వచ్చేస్తా అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది భాగ్యమ్మ.
ట్రైనింగ్ సెంటర్ లో చాలా ఏకాగ్రతగా కరాటే ప్రాక్టీస్ చేస్తుంటుంది దేవి. అటుగా వెళుతున్న ఆదిత్య ఆమెని చేసి అవుతాడు. కూతురు కరాటే నేర్చుకోవడం చూసి ముచ్చట పడతాడు. అప్పుడే ఆదిత్యని చూసిన దేవి పరిగెత్తుకుంటూ అతని దగ్గరకి వస్తుంది. నువ్వు ఇక్కడ ఉన్నావ్ ఎంటమ్మ అని ఆదిత్య అడగగా.. మా అమ్మే ఇక్కడ చేర్పించిందని చెబుతుంది దేవి. అంతలో ఆమె ముఖం మీద దెబ్బలు చూసి బాధపడుతూ.. ఏమైందని అని అడుగుతాడు. అప్పుడు స్కూల్ లో జరిగింది అంతా చెబుతుంది దేవి. దాంతో.. టీచర్ల మీద కోపంతో వాళ్లేం చేస్తున్నారో అడుగుతా అంటూ ప్రిన్సిపల్ కి కాల్ చేయబోతాడు ఆదిత్య. ‘వద్దు సారు.. అక్క అప్పుడే వాళ్లని కొట్టింది. ఇప్పుడు మీరు చెబితే ఆయన కూడా మరోసారి వాళ్లని కొడతాడు. పాపం కదా’ అని జాలిగా అంటుంది దేవి. సరే అంటాడు ఆదిత్య. నేను కరాటే బాగా నేర్చుకుని మా నాన్న దొరకగానే.. మా అమ్మని కొట్టిన దానికంటే గట్టిగా కొడతా అంటుంది దేవి. అది విని.. ‘మాధవ్ గా నా పిల్లలలో విషం నింపావు కదరా. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అమ్మకు జరిగిన విషయం చెప్పాలి’ అని అనుకుంటాడు. దేవి కరాటే నేర్చుకోమని చెప్పి ఇంటికి వెళతాడు.
సోఫాలో కూర్చొని దేవి మాటలు తలుచుకుంటూ బాధపడుతూ ఉంటాడు ఆదిత్య. ఇంతలో.. సత్య చేతిలో ఫైల్స్ తో అక్కడికి వస్తుంది. అవి ఆదిత్య ఆఫీస్ ఫైల్స్. తోటి ఉద్యోగులు ఇచ్చి వెళ్లిన ఫైల్స్. వాటిని ఆదిత్య ముందు పెట్టి.. సాయంత్రమే నువ్వు ఆఫీస్కి వేళ్లట్లేదని తెలిసింది. నీకు ఏమైంది.. దేవి గురించి ఎందుకు అంతగా ఆరాటపడుతున్నావ్ అంటూ నిలదీస్తుంది. ఆమె తన అక్క కూతురు మాత్రమే కదా అని చెబుతుంది సత్య. ఎప్పటిలాగే ఆదిత్య సమాధానం చెప్పకుండా చూస్తూ నిలబడిపోతాడు. దీంతో కోపం, బాధ కలిసిన భావనతో అక్కడి నుంచి వెళ్లిపోతుంది సత్య.
అక్కడేమో.. ఇంటికి వెళ్లిన దేవి దిండ్లతో కరాటే ప్రాక్టీస్ చేస్తుంటుంది. అది చూసిన జానకి కంగారు పడుతుంది. అప్పుడే అక్కడికి వస్తారు రాధ, దేవి తాతా గారు. దేవి కరాటే నేర్చుకుంటుంది అని తెలిసి మా రోజుల్లో ఇలాంటివి లేవమ్మా అంటూ బుగ్గలు నొక్కుకుంటుంది జానకి. దానికి ఈ కాలంలో ఆడపిల్లలకి కరాటే అవసరం అని దేవికి సపోర్ట్ చేస్తాడు తాతా.
మరోవైపు భాషాతో కలిసి దేవుడమ్మ దగ్గరకు వస్తుంది నెలలు నిండిన కమల. తనకు పుట్టబోయే బిడ్డకు రుక్మిణీ పేరు పెట్టుకోవాలి అని అనుకుంటున్నట్లు చెబుతుంది. అది విన్న దేవుడమ్మ.. ‘రుక్మిణీ బతికే ఉంది. నీ బిడ్డపుట్టేసరికి ఆమె ఈ ఇంటికి వచ్చేస్తుంది.. నీ బిడ్డని తనే ఆడిస్తుంది.. ఆ నా నమ్మకం నాకు ఉంది’ అంటుంది. అది విన్న కమల, బాషా చాలా సంతోషపడతారు. అక్కడేమో.. దేవి మాటలు తలచుకొని బాధపడుతుంటుంది రాధ. మాధవ్ చేస్తున్న చెత్త విషయాల గురించి ఎవరికీ చెప్పాలో తెలియక తనలో తానే కుమిలిపోతుంది. దేవుడమ్మకి ఆదిత్య అస్సలు నిజం చెబుతాడా.. మాధవ్ బండారం రాధ బట్టబయలు చేస్తుందా తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే..