ఇంతకుముందు ఎపిసోడ్లో ఆదిత్య సరిగ్గా ఆఫీస్కి రావట్లేదని సత్యకు తెలుస్తుంది. దాని గురించి ఆరా తీస్తుంది. రుక్మిణీ భాగ్యమ్మను కలిసిద్దేమోనన్నా అనుమానం దేవుడమ్మ వస్తుంది. దీంతో.. భాగ్యమ్మ దగ్గరకి వెళ్లి ‘రుక్మిణీ కన్నతల్లివైన నీ దగ్గరకు కానీ వచ్చిందా?’ అని ఆరా తీయడంతో కథనం ఉత్కంఠగా మారింది. ఆ తర్వాత ఆగస్టు 1న ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దాం..
‘రుక్మిణీ అందరికీ కనిపిస్తుంది కానీ నాకు మాత్రం కనిపించట్లేదు. నీకేమైనా తెలుసా’ అంటూ భాగ్యమ్మని బాధగా అడుగుతుంది
దేవుడమ్మ. ఎమోషనల్గా ఎన్ని విధాలుగా కోడలు గురించి దేవుడమ్మ అడిగిన నోరు మెదపదు భాగ్యమ్మ. దీంతో చేసేది లేక బాధ పడుతూనే అక్కడి నుంచి వెళ్లిపోతుంది దేవుడమ్మ. అది చూసి భాగ్యమ్మ కూడా చాలా ఎమోషనల్ అవుతుంది. ‘నా కూతురికి ఇచ్చిన మాట కోసం అన్నం పెట్టిన నీకు అబద్ధం చెబుతున్న నన్ను క్షమించు తల్లీ అని దేవుడమ్మని ఉద్దేశించి అనుకుంటుంది. అమ్మా రుక్మిణీ దేవుడు నిజంగా నీ తలరాతను బాగా రాయలేదమ్మా. లేకపోతే అమ్మకంటే ఎక్కువ ప్రేమించే అత్తకి దూరంగా ఉండాల్సి రావడం ఏంటి తల్లీ’ అని భాగ్యమ్మ చాలా బాధ పడుతుంది.
ఆ తర్వాత సీన్ లో.. మొక్కలకు నీళ్లు పోతుండగా కూతుర్లు ఇద్దరు ఇంటికి వస్తారు. అందులో దేవికి దెబ్బలు తగిలి ఉంటాయి. దీంతో రాధ కంగారుగా ఏమైంది బిడ్డ.. ఎక్కడైనా కింద పడ్డవా అని అడుగుతుంది. వెంటనే దేవి పక్కనే ఉన్న చిన్మయి..‘స్కూల్ పిల్లలు కొడుతుంటే నేనే ఆపి.. వాళ్లని కొట్టి పంపించి.. దేవిని ఇంటికి తీసుకొచ్చా అమ్మా’ అని చెబుతుంది. అరే పిల్లలు కొట్టుడేంది అని రాధ అడగగా.. ‘దేవికి మార్కులు తక్కువ వచ్చాయని.. కొందరు హేళనగా మాట్లాడారు. దేవికి కోపం వచ్చి వాళ్లని కొట్టగా.. వాళ్లందరూ తిరిగి కొట్టేశారు.. నేను వెళ్లి ఆపాను’ అంటూ చెబుతుంది చిన్మయి. దాంతో రాధ షాక్ అవుతుంది. అక్కని ఎవరైనా ఏమైనా అంటే నువ్వే కొట్టే దానివి నువ్వు దెబ్బలు తినుడెంది బిడ్డ అంటూ బాధ పడుతుంది రాధ. ఇంట్లోకి తీసుకెళ్లి దెబ్బలకి మందు రాస్తుంది. అప్పుడే చిన్మయి మార్కులు చదివి వినిపిస్తుంది. అందులో దేవి కేవలం పాస్ మార్కులు మాత్రమే వస్తాయి. అదేంది.. బిడ్డ ఇట్లా చదివితే మీ అవ్వ తాతా కోరుకున్నట్లు నువ్వు కలెక్టర్ ఎట్లా అవుతావు అని బాధగా అంటుంది. దానికి దేవి నేను చదివిన గుర్తుండట్లేదు.. నాన్నే గుర్తొస్తున్నాడు అని చెబుతుంది. దాంతో.. నా దేవిని అన్నింటికీ తట్టుకునేలా చేయాలని ఫిక్స్ అయినా రాధ తన కూతురిని ఎక్కడికో తీసకెళ్లాలని ఫిక్స్ అవుతుంది. ఎక్కడికి అని దేవి అడిగితే నికే తెలుస్తుంది పదా అంటుంది.
ఆ తర్వాత సీన్ దేవుడమ్మా ఇంటికి మారుతుంది. చేతిలో రుక్మిణీ ఫోటోని పట్టుకొని ఇంట్లోకి పరిగెత్తుకుంటూ వస్తాడు సూరి. అది చూసినా రాజమ్మ ఏమైంది అని అడగగా.. ఆ ఊరి వాళ్లు తను అమ్మాయిల కోసం తిరుగుతున్నాననే అనుమానంతో కొట్టడానికి మీదికి రాగా పారిపోయి వచ్చినట్లు చెబుతాడు. ఆ ఊరిలో పక్కాగా రుక్మిణీ ఉంది. ఈసారి రుక్మిణీ ఫొటో తీసుకుని ఆ ఊరి ప్రెసిడెంట్ రామ్మూర్తికి దగ్గరకు వెళ్తాను.. ఆయన్నే అడిగితే ఆ ఊరిలో రుక్మిణీ ఉందో లేదో తెలుస్తుంది కదా అంటాడు సూరి. ‘ఊరుకోండి. అంతదాకా వస్తే మా అక్కయ్య పేపర్లోనే ప్రకటన వేయించకపోయేదా? కానీ ఎందుకు అలా చేయలేదు.. మనకు రుక్మిణీ ఎంత ముఖ్యమో.. ఈ ఇంటి పరువు కూడా అంతే ముఖ్యం.. రుక్మిణీ కనిపించడం లేదనే నిజం బయటికి రావద్దు అనేకదా తాపత్రయం.. అంతేకాకుండా ఇక్కడ ఆదిత్య ఆఫీసర్ ఈ విషయం అందరికి తెలిస్తే వాడికి అంతా అవమానం ’ అంటుంది రాజ్యమ్మ. దాంతో అది నిజమే అనుకుంటూ సైలెంట్ అవుతాడు సూరి. వారి మధ్య జరిగిన సంభాషణని గుమ్మం దగ్గర నిలబడి విన్న ఆదిత్య.. ‘పిన్ని చెప్పింది నిజమే కదా.. ఇప్పుడు రుక్మిణీ గురించి అమ్మతో మాట్లాడినప్పుడు పరువుని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. సందర్భం చూసి నిజం చెప్పాలి. లేకపోతే చాలా ప్రమాదం’ అనుకుని అతను కూడా కామ్గా ఉండిపోతాడు.
ఆ తర్వాత.. దేవిని కరాటే ట్రైనింగ్ సెంటర్ కి తీసుకెళుతుంది రాధ. దేవిని కరాటే నేర్చుకోవాలి అని చెబుతుంది. దానికి నేను ఆఫీసర్ అవుతాను కదా నాకెందుకు ఈ కరాటే అని అడుగుతుంది దేవి. ‘నువ్వు కలెక్టర్ అవ్వాలంటే చాలా సమయం పడుతుంది. చాలా కష్టాలు నీకు ఎదురవుతాయి. వాటిని ఎదుర్కోడానికి కరాటే నీకు ఉపయోగపడుతుంది. అందుకే నేర్చుకోవాలి’ అని చెబుతుంది రాధ. సరే అని చెబుతుంది దేవి. ఆ తర్వాత అక్కడ చేర్పించి ఇంటికి వెళుతుంది రాధ.
రాధ ఇంటికి వెళ్లేసరికి చిన్మయితో ఏదో మాట్లాడుతూ కనిపిస్తుంది భాగ్యమ్మ. అది చూసి కూతురిని ఇంట్లోకి వెళ్లమని చెప్పి భాగ్యమ్మ అక్కడికి ఎందుకు వచ్చిందో అడుగుతుంది రాధ. దానికి.. దేవుడమ్మ ఇంటికి వచ్చిన విషయం మొత్తం వివరిస్తుంది భాగ్యమ్మ. అది విన్న రాధ ఏం చేస్తుంది. దేవుడమ్మ బాధని అర్ధం చేసుకుంటుందా లేదా తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే..