Devotional: మన దేశంలోని అనేక గ్రామాలు, దేవాలయాలు, పర్యాటక ప్రాంతాల్లో విచిత్రమైన ఆచారాలు కొనసాగుతూ ఉంటాయి. వాటిని అక్కడి ప్రజలు పూర్తిగా నమ్మడమేకాకుండా భక్తిశ్రద్ధలతో పాటిస్తారు. ఇలాంటి వాటి గురించి తెలుసుకోవడం ఎప్పుడూ ఆసక్తిగా ఉంటుంది. కర్నాటకలోని సుల్లియా అనే గ్రామంలోని కుక్కే సుబ్రమణ్య దేవాలయంలో ప్రతీయేటా నవంబర్ నెలాఖరు లేదా డిసెంబర్ మొదటి వారంలో ఓ వింత ఉత్సవం జరుగుతుంది.
సుబ్రమణ్య స్వామిని ఇక్కడ నాగ దేవత గా ఆరాధిస్తారు. ఈ గుడిలోని ప్రధాన పర్వ దినం తిపూయం నాడు రాష్ట్ర నలుమూలాల నుంచి భక్తులు ఇక్కడికి వస్తుంటారు. సర్పదోష పూజలతో పాటు.. ఆశ్లేష బలి పూజ, సర్ప సంస్కారం అనే మరో రెండు ప్రధానమైన సర్ప దోష పూజలు కూడా ఈ గుడిలో చేస్తారు. దీంతో పాటుగా ఏడేస్నానాలు అనే వింత ఆచారం కూడా అమలు చేస్తారు.
వింత ఆచారం ఏంటంటే?
ఇక్కడ ఆలయ ప్రాంగణం చుట్టూ ఆకులు వేసి అక్కడ నైవేద్యాలు పెడతారు. ఈ ఆచారం ప్రకారం మొదట బ్రాహ్మణులు విస్తరాకులలో భోజనం చేస్తారు. వారు తిని వదిలేసిన ఆకులను అక్కడే ఉంచుతారు. ఊర్లోని దళితులు, గిరిజనులు వచ్చి ఆ ఆకుల పై పొర్లు దండాలు పెడతారు. ఇలా చేస్తే వారి చర్మ వ్యాధులు తగ్గిపోతాయని, వారి పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు. పొర్లు దండలు పెడుతున్న భక్తులు ఈ ఆచారాన్ని పాటించే వారిలో అత్యున్నత చదువులు చదివిన వారు కూడా ఇక్కడ ఎంగిలాకులపై పొర్లు దండాలు పెడుతుంటారు. ఈ వింత ఆచారంపై కొందరు కోర్టును ఆశ్రయించారు. కాగా, ప్రస్తుతం ఈ వ్యవహారం కోర్టు లో పెండింగ్లో ఉంది.
Devotional:
కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ఉత్సవాలను నిలిపివేసింది అక్కడి ప్రభుత్వం. ఇప్పుడు ఆంక్షలు ఎత్తివేయడంతో ఏడేస్నానాలకు అనుమతించారు. చంపా షష్టి ఉత్సవాల సందర్బంగా ఈసారి మూడు రోజులపాటు భక్తులకు స్నానాలకు అవకాశం కల్పించారు. చౌతి, పంచమి, షష్ఠి నాడు అంటే నవంబర్ 27,28,29 తేదీల్లో ఇక్కడ స్నానాలు చేసేందుకు భారీగా భక్తులు తరలివస్తారని అంచనా.