Diwali2022 : దీపావళికి స్వీట్లు పంచుకోవడం ఆనవాయితీ. ఈ పండుగ సందర్భంగా దాదాపు నాలుగైదు రోజులు ముందు మిఠాయి షాపులన్నీ కళకళలాడుతుంటాయి. కేజీల కొద్దీ స్వీట్లు కొనుగోలు చేస్తూ ఇంటిల్లి పాదీ పంచుకుంటూ ఉంటారు. బంధుమిత్రులకూ పంచిపెడుతుంటారు. అయితే, అందరూ స్వీట్లు తింటుంటే మధుమేహం ఉన్న వారు మాత్రం అలా చూస్తూ ఉండిపోతుంటారు. నోట్లో నీళ్లు ఊరుతున్నా మిన్నకుండిపోవాల్సిందే. అయితే, అలాంటి వారి కోసమే ఈ కథనం.. సాధారణ స్వీట్లు కాకుండా ఖర్చూరంతో చేసిన మిఠాయిలు తింటే మధుమేహం ఉన్నా ఏమీ చేయదు. ఇలాంటి వ్యాధి గ్రస్తులకు స్వీటు లోటు తీరిపోతుంది.
దేశ వ్యాప్తంగా దీపావళి చేసుకొనేందుకు సర్వం సిద్ధమవుతోంది. అప్పుడే టపాసుల సందడి, స్వీట్ల సందడి కూడా పెద్ద ఎత్తున కొనసాగుతోంది. పిండి వంటలు కూడా కీలక పాత్ర పోషిస్తాయి ఈ పండుగరోజున. రుచికరమైన వంటకాలు, స్వీట్లు స్వయంగా తయారు చేసుకొని తింటూ ఉంటారు. ఇరుగు పొరుగు వారికి కూడా పంచుతూ ఆనందం వ్యక్తం చేస్తుంటారు.
మధుమేహ వ్యాధి గ్రస్తుల కోసం కొన్ని ప్రత్యేక స్వీట్లు కూడా ఉన్నాయి. వారు కూడా తినగలిగే కొన్ని రెసిపీలేంటో ఇప్పుడు చూద్దాం.. వాటిలో మొదటిది మిక్సుడు నాట్స్ హల్వా. ఇందుకోసం వేయించిన జీడిపప్పు ఓ కప్పు, వేయించిన వేరుశనగ ఓ కప్పు, వాల్ నట్స్ అరకప్పు, పిస్తా అరకప్పు, కప్పులో ఫ్యాట్ మిల్క్ ఓ రెండు కప్పులు, స్టెవియా చక్కెర ఓ టేబుల్ స్పూన్ అందుబాటులో ఉంచుకోవాలి. అన్ని రకాల గింజలను కాస్త వేయించి తర్వాత మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవాలి. అనంతరం స్టౌ మీద పాత్రను ఉంచి 2 కప్పుల తక్కువ కొవ్వు ఉన్న పాలను వేసి మరిగించాలి. మంటను మీడియంపై ఉంచి మైదాపిండిని కలపాలి. ఇక మిశ్రమం బాగా కలిపాక హల్వాగా మారుతుంది. అప్పుడు ఓ టీస్పూన్ స్టెవియా చక్కెరను కలపాలి. ఇక మీ స్వీట్ రెడీ.
Diwali2022 : మరో రెసిపీ అంజీర్ బర్పీని..
అంజీర్ బర్పీని తయారు కూడా చేసుకోవచ్చు. ఇందుకోసం ఎండు అత్తి పండ్లు అరకప్పు, ఓ లీటరు తక్కువ కొవ్వున్న పాలు, కొద్దిగా యాలకుల పొడి, వేయించిన, పొడి గింజలు కాసిన్ని తీసుకోవాలి. వీటితో అంజీర్ బర్పీని తయారు చేసేసుకోవచ్చు. అలాగే ఖర్జూరం పండు లడ్డును కూడా తయారు చేసుకోవచ్చు. ఇందుకోసం గింజ తీసిన ఖర్జూరం ఓ కప్పు, తురిమిన కొబ్బరి అర కప్పు, బాదం అరకప్పు, వేరుశనగ అరకప్పు అవసరం అవుతాయి. ఖర్జూరాలను నానబెట్టి, మెత్తగా రుబ్బుకోవాలి. తురిమిన వేరుశనగలను, రుబ్బిన ఖర్జూరం పేస్ట్ తో మిక్స్ చేయాలి. బాల్స్ గా తయారు చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు.