జబర్దస్త్ కామెడీ రియాలిటీ షో తెలుగు టెలివిజన్ ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకుంటుంది. టెలివిజన్ చరిత్రలో ఓ కొత్త అధ్యాయంలా ఈ జబర్దస్త్ షో స్టార్ట్ కావడంతో పాటు సంచలనం సృష్టించింది. రేటింగ్స్ పరంగా అద్భుతమైన రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. ఇక జబర్దస్త్ షో సక్సెస్ కావడంతో మల్లెమాల ఎక్స్ ట్రా జబర్దస్త్ అంటూ మరో షో కూడా స్టార్ట్ చేసింది. ఈ రెండు షోల ద్వారా యాంకర్స్ గా అనసూయ, రేష్మి గౌతమ్ ఎంట్రీ ఇచ్చి ఊహించని స్థాయిలో క్రేజ్ ని సొంతం చేసుకున్నారు. పొట్టి డ్రెస్సులుతో అందాల విందు చేస్తూ అన్ని రకాల ఆడియన్స్ ని కూడా ఆకర్షించారు. ఇక ఈ కామెడీ షో ద్వారా ఎంతో మంది టాలెంటెడ్ నటులు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు.
వారు సినిమాలలో కూడా మంచి అవకాశాలు సొంతం చేసుకున్నారు. ఎన్ని వివాదాలు వచ్చిన ఇప్పటికి కూడా దిగ్విజయంగా ఈ షో కొనసాగుతుంది. అయితే గత కొంతకాలంగా జబర్దస్త్ కి గడ్డుకాలం నడుస్తుంది. పాత నటులు అందరూ కూడా ఒక్కొక్కరుగా బయటకి వెళ్లిపోయారు. ఇక జబర్దస్త్ షోకి హైప్ తీసుకొచ్చిన సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, హైపర్ ఆది కూడా గత కొంత కాలంగా షోకి దూరంగా ఉన్నారు. సినిమా అవకాశాలు పెరిగి బిజీ కావడంతో షోకి దూరంగా ఉన్నారని చాలా మంది భావిస్తున్నారు. అయితే అంతర్గతంగా మల్లెమాల వారితో వివాదం కారణంగా షోకి దూరంగా ఉన్నారనే మాటలు కూడా వినిపిస్తున్నాయి.
ఇక సుడిగాలి సుధీర్ టీమ్ కి జబర్దస్త్ లో ఎంత ఫేమ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ టీమ్ కి మెయిన్ పిల్లర్స్ అంటే గెటప్ శ్రీను. అయితే ఇతను అర్ధాంతరంగా షోకి దూరం అయ్యారు. దీనిపై రకరకాల ఊహాగానాలు వినిపించాయి. అయితే సడెన్ గా మళ్ళీ గెటప్ శ్రీను జబర్దస్త్ లో రీఎంట్రీ ఇచ్చారు. సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను వదిలేసిన తర్వాత ఆటో రామ్ ప్రసాద్ ఆ టీమ్ బాధ్యతలు తీసుకున్నారు. అయితే వచ్చే ఎపిసోడ్ కి సంబందించిన ప్రోమో ఆటో రామ్ ప్రసాద్ స్కిట్ చేస్తూ ఉండగా సడెన్ గా గెటప్ శ్రీను ఎపిసోడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. దీంతో అతను మళ్ళీ జబర్దస్త్ షోకి రీఎంట్రీ ఇచ్చారనే విషయం కన్ఫర్మ్ అయ్యింది. అయితే ఇది కేవలం ఒక్క ఎపిసోడ్ కోసమేనా లేక పూర్తిగా కొనసాగుతాడా అనేది వేచి చూడాలి.