బంగారం ప్రియులకు భారీ షాక్. పసిడి ధర మరోసారి గణనీయంగా పెరిగింది.
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం డిమాండ్, కేంద్ర రిజర్వ్ బ్యాంకుల్లో బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం, కరోనా మహమ్మారి, డాలర్ విలువ, రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య ఇప్పుడు నెలకొన్నటువంటి పరిస్థితులు అన్నీ..బంగారం ధరలపై ప్రభావం చూపుతుంటాయి. ఈ క్రమంలో ఇవాళ బంగారం ధర భారీగా పెరిగింది.
దేశ రాజధాని ఢిల్లీలో పది గ్రాముల బంగారం 22 క్యారెట్ల ధర 46300 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ల బంగారం 50510 రూపాయలుగా ఉంది. ఇక దేశ ఆర్ధిక రాజధాని మంబైలో పది గ్రాముల బంగారం 22 క్యారెట్ల ధర 46 వేల 3 వందల రూపాయలు ఉండగా, 24 క్యారెట్ల బంగారం 50 వేల 510 రూపాయలుగా ఉంది. కోల్కతాలో పది గ్రాముల బంగారం 22 క్యారెట్ల ధర 46 వేల 3 వందల రూపాయలు కాగా, 24 క్యారెట్ల ధర 50 వేల 150 రూపాయలుంది. ఇక చెన్నైలో పది గ్రాముల బంగారం 22 క్యారెట్ల ధర 47 వేల 290 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం 51 వేల 590 రూపాయలుగా ఉంది. బెంగళూరులో పది గ్రాముల బంగారం 22 క్యారెట్ల ధర 46 వేల 3 వందల రూపాయలతై..24 క్యారెట్ల ధర 50 వేల 150 రూపాయలుగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఇవాళ ఇలా ఉన్నాయి. హైదరాబాద్లో పది గ్రాముల బంగారం 22 క్యారెట్ల ధర 46 వేల 3 వందలు కాగా, 24 క్యారెట్ల బంగారం 50 వేల 150 రూపాయలుంది. ఇక విజయవాడ, విశాఖపట్నంలో పది గ్రాముల బంగారం 22 క్యారెట్ల ధర 46 వేల 3 వందలు కాగా, 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర50 వేల 150 రూపాయలుగా ఉంది.