Health Tips : ఉదయం లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకునే వరకు మహిళలు అనేక పనులతో నిత్యం బిజీబిజీగా ఉంటారు. ఉద్యోగానికి వెళ్లే మహిళల గురించి ఇంకా ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అటు ఇంటిని ఇటు ఆఫీస్ ని రెండింటినీ మేనేజ్ చేస్తూ నెట్టుకొస్తుంది. ఈ క్రమంలో తన హెల్త్ గురించి కానీ ఆరోగ్య విషయాల గురించి గానీ పెద్దగా పట్టించుకోదు. అందుకే అనేక సమస్యలు మహిళలను వెంటాడుతూ ఉంటాయి. మరీ ముఖ్యంగా ప్రతినెలలో వచ్చే ఆ ఐదు రోజులు మహిళలు పడే వేదన వర్ణనాతీతం. మెన్సెస్ పెయిన్ మహిళలను శారీరకంగా ఇబ్బంది పెట్టడమే కాదు. మానసిక స్థితిపై ప్రభావం చూపిస్తుంది. ఏ పని చేసుకోనివ్వదు. తీవ్ర అసౌకర్యానికి గురి చేస్తూ ఉంటుంది. ప్రతి స్త్రీకి ఈ సమయంలో విపరీతమైన కడుపునొప్పి వస్తుంది.కొంతమంది స్త్రీలకు రుతుక్రమంలో తిమ్మిర్లు, ఒంటి టనొప్పులు నడుం నొప్పి వంటి సమస్యలు కూడా వస్తాయి. ప్రధానంగా వారు తీసుకునే ఆహారంలో లోటుపాట్లు కారణంగా ఈ సమస్యలు తలెత్తుతాయని వైద్యులు చెబుతున్నారు. అయితే ఈ నొప్పిని తగ్గించుకునేందుకు చాలా మంది మహిళలు టాబ్లెట్స్ వాడుతారు. కానీ ఇది ఎంత మాత్రం ఆరోగ్యకరమైనది కాదు. పీరియడ్స్ నొప్పుల నుంచి ఉపశమనం పొందడానికి కూడా కొన్ని ఆహార పదార్థాలు ఉన్నాయని చెబుతున్నారు మరి అవేంటో ఇప్పుడు చూద్దాం.
రోజు తినే ఆహారమే కానీ దాన్ని ఒక క్రమ పద్ధతిలో తినడం వల్ల మెన్సెస్ సమయంలో వచ్చే నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు. తీసుకునే ఆహారంలో ప్రధానంగా పచ్చని ఆకుకూరలు ఉండాలంటున్నారు డైటీషియన్లు. పాలకూర,తోటకూర, బచ్చలి కూర వట్టి ఆకుకూరలతో పాటు క్యాబేజీ, బ్రోకలీ,కాలీఫ్లవర్ వంటి వాటిని కూడా తీసుకోవాలని చెబుతున్నారు. తీసుకునే ఆహారంలో ప్రధానంగా కాల్షియం, మెగ్నీషియం స్థాయిలు పుష్కలంగా ఉండేలా చూసుకోవాలని చెబుతున్నారు.
కంటి చూపులు మెరుగుపరచడంలో ఫ్యాట్ ను తగ్గించడంలో మాత్రమే కాదు చేపలు రుతుక్రమ సమయంలో వచ్చే నొప్పులను తగ్గిస్తాయట. చేపల్లో ఉండే ఐరన్,ప్రోటీన్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు, పోషకాలు మహిళలు నొప్పి నుంచి ఉపశమనం పొందటానికి ఉపయోగపడతాయని అంటున్నారు వైద్యులు. అందుకే ప్రతి మహిళా తమ ఆహారంలో చేపలను భాగం చేసుకోవాలని సూచిస్తున్నారు. వారంలో వీలైతే రెండుసార్లు చేపలను తినాలని చెబుతున్నారు. కేవలం బహిస్టు సమయంలోనే కాకుండా చేపలను తరచుగా తినడం వల్ల మహిళలు ఎంతో ఆరోగ్యంగా ఉంటారు.
ఈ ఐదు రోజులు కేవలం కడుపునొప్పి మాత్రమే కాదు, దానికి తోడుగా తలనొప్పి, వెన్నునొప్పి వేధిస్తుంటాయి ఈ నొప్పులు నుంచి ఉపశమనం పొందాలంటే నీటి శాతం అధికంగా ఉండే ఆహార పదార్థాలను ఆహారంలో భాగం చేసుకోవాలని చెబుతున్నారు. అంతే కాదు ప్రోబయోటిక్ సమృద్ధిగా లభించే పెరుగు కూడా పీరియడ్స్ సమస్యలు సమయంలో తీసుకుంటే చాలా వరకు నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.
మరి మహిళలు ఇంకా ఎందుకు ఆలోచిస్తారు ఈ ఐదు రోజులు కూడా ఇలాంటి ఆహార పదార్థాలను తీసుకొని ఉల్లాసంగా ఉంటారని ఆశిస్తున్నాం