Health Tips : గత వారం రోజులుగా వాతావరణం లో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. తెల్లవారుజామున రాత్రి వేళల్లో చలి తీవ్రత అధికమవుతుంది. ఒక్కసారిగా వాతావరణం లో మార్పు రావడంతో చాలా మంది జలుబు దగ్గుతో బాధపడుతున్నారు. చంటి పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ఈ చలి తీవ్రతను తట్టుకోలేకపోతున్నారు. కరోన వంటి వైరస్ ల కారణంగా చాలా మందిలో రోగనిరోధక శక్తి క్షీణించిపోయింది. చిన్నపాటి జలుబు వచ్చినా తట్టుకోలేకపోతున్నారు. అదే పనిగా తుమ్ములు రావడం వల్ల అసహనానికి గురవుతున్నారు. అయితే చలికాలంలో ఇవన్నీ కామన్. అప్పుడే తగ్గినట్లు అనిపిస్తుంది కానీ మళ్ళీ మొదటికి వస్తుంది. ఇక వీటి నుంచి ఉపశమనం పొందేందుకు చాలా మంది ఇంగ్లీష్ మందులు వాడుతుంటారు. ఇవి పెద్దగా పని చేయకపోవడంతో నాచురల్ మెడిసిన్ వైపు చాలామంది చూస్తున్నారు. ప్రధానంగా ఆయుర్వేదిక్ మందులకు ఆసక్తి కనబరుస్తున్నారు. మరి అలాంటి ఆయుర్వేదిక్ మందుల గురించి మనము తెలుసుకుందాం.
Health Tips : భారతదేశంలో కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఆయుర్వేదిక్ మెడిసిన్ అందుబాటులోకి వచ్చింది. అప్పట్లో జలుబు వచ్చినా,దగ్గు వచ్చిన జ్వరం బారిన పడినా ఈ ఆయుర్వేదిక్ మెడిసిన్ వాడేవారు. కాలక్రమమైన మారుతున్న కాలానికి అనుగుణంగా నేటితరం ఇంగ్లీష్ మెడిసిన్ కు అలవాటు పడింది. నిజానికి ఆయుర్వేద మూలికల్లో ఉన్న అద్భుతమైన శక్తి ఏ మందులు లేదు. అందులో ముఖ్యమైనది ప్రతి ఒక్కరి ఇంట్లో సులువుగా లభించేది తులసి. తులసిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఇది యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ లక్షణాలు కలిగిన మొక్క. ఏమాత్రం జలుబుగా అనిపించినా ఉదయం పూట రెండు నుంచి మూడు రెమ్మలు అలా తుంచుకుని తింటే దెబ్బకు జలుబు మటుమయమవుతుంది. జలుబుకు ఇది చక్కటి మెడిసిన్ వంటిది.
భారతదేశంలో కనిపించే చాలా వరకు చెట్లకు ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. చెట్టు బెరడు నుంచి కొమ్మ ఆకు వరకు ప్రతీది వనమూలికంగానే పనిచేస్తుంది. వీటిని ప్రాచీన కాలం నుంచి అనేక వ్యాధులకు అనేక రకాలుగా వినియోగిస్తూ వచ్చారు మన పూర్వీకులు. అలాంటి వాటిలో ఒకటి నక్కెరి పండ్లు. ఈ పండ్లను సాధారణంగా జలుబు వచ్చినప్పుడు లేదు దగ్గు వచ్చినప్పుడు లేదా ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బందులు పడిన సమయాల్లో చికిత్స నిమిత్తం ఉపయోగిస్తుంటారు. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ వంటి లక్షణాలు అనేకం ఉన్నాయి. అంతేకాదు ఎలాంటి నొప్పినైనా ఇట్టే మాయం చేసే లక్షణం కూడా ఉంది.
చాలామంది నమ్మరు కానీ మొక్కలు కేవలం నీడకు లేదా గాలికి మాత్రమే ఉపయోగపడతాయని అనుకుంటారు కానీ వాటిలో ఉండే ఔషధ లక్షణాలు తెలుసుకుంటే అవ్వక్కు అవ్వాల్సిందే. అలాంటి వాటిలో ఒకటి రేలపండ్లు. ఈ పండ్లు జ్వరాన్ని గొంతులో కలిగే అసౌకర్యంతో పాటు మంట, చాతిలో కలిగే ఇబ్బందిని తగ్గిస్తుంది. ప్రధానంగా శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో ఈ పండ్లు ముఖ్యపాత్రను పోషిస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల సీజనల్గా వచ్చే వ్యాధుల నుంచి తప్పించుకోవచ్చు.
ఇక ప్రతి ఏడాది చలికాలం వస్తే చాలు మార్కెట్లో సందడిగా కనిపిస్తూ ఉంటాయి రేగి పండ్లు. ఈ పండ్లు తినడానికి టేస్టీగానే కాదు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ పండులో అధికంగా ఉండే విటమిన్ సి శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంతోపాటు అనేక రకాల సీజనల్ వ్యాధులకు అడ్డుకట్ట వేస్తుంది. ముఖ్యంగా దగ్గుతో బాధపడేవారు ఈ పండ్లను తినడం వల్ల చాలా వరకు ఉపశమనం పొందవచ్చు.
చివరగా అశ్వగంధ కూడా సీజనల్ వ్యాధుల నుంచి మన శరీరాన్ని కాపాడతాయని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. అశ్వగంధ యాంటీవైరల్ ఏజెంట్ గా పనిచేస్తుంది. ఇలాంటి జలుబు లక్షణం కనిపించిన దీన్ని తీసుకోవడం వల్ల ఉపశమనం పొందవచ్చు.