Ayyayyo vaddamma Sharath : ‘‘అయ్యయ్యో వద్దమ్మా.. పక్కనే టీకొట్టు పెట్టాను.. అందరికీ టీ ఇస్తున్నాను.. డబ్బులు వద్దు కానీ, సుఖీభవ.. సుఖీభవ’’ అంటూ ఓ వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ యాడ్ను హైదరాబాద్కు చెందిన శరత్ అనే యువకుడు స్పూఫ్ చేసిన విషయం తెలిసిందే. ఈ వీడియో కాస్తా వైరల్ అవడంతో శరత్ ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. ఆ మీమ్ను ఇన్ స్టా రీల్స్ సహా ఎన్నో షార్ట్ వీడియో యాప్లలో నెటిజన్లు ఎంతో మంది దానికి రీల్స్ చేశాడు. ఇప్పుడు మీమర్స్ అందరికీ అతనొక సబ్జెక్ట్ అయిపోయిన శరత్పై ఇటీవల దాడి జరిగింది. ఈ దాడిలో శరత్ తీవ్ర గాయాలపాలయ్యాడు. ప్రాణాపాయం లేకపోయినప్పటికీ కంటికి బాగా దెబ్బతగిలింది. తాజాగా ఇతను ఆర్టీవీ అనే యూట్యూబ్ ఛానల్తో మాట్లాడుతూ.. ఇంట్రస్టింగ్ విషయాన్ని పంచుకున్నాడు.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కంపెనీ యూవీ క్రియేషన్స్ నుంచి తనకు కాల్ వచ్చిందని శరత్ వెల్లడించాడు. అయితే ఇటీవలే తనపై జరిగిన దాడిలో తన ఫేస్ చాలా ఖరాబైందని.. ఆ మొహంతో వెళ్లలేక ఆగిపోయానని చెప్పుకొచ్చాడు. ఆ విషయాన్ని తాను యూవీ క్రియేషన్స్ వారికి సైతం చెప్పానని.. తాను రికవరీ అవ్వాలని.. అయ్యాక కాల్ చేస్తామని చెప్పినట్టు చెప్పుకొచ్చాడు. తాను తల్లిదండ్రులను లెక్కచేయనంటూ వస్తున్న రూమర్స్లో నిజం లేదని.. తనకు వాళ్లు దేవుళ్లతో సమానమని చెప్పుకొచ్చాడు. అయితే ఇంట్లో చెప్పకుండా వారం, పది రోజుల పాటు బయటకు వెళ్లిపోయేది మాత్రం నిజమేనని అంగీకరించాడు.
Ayyayyo vaddamma Sharath : వీడియోతో అసలు నిజం బయటకు వచ్చింది..
ఇక శంకర్ తండ్రి తన కుమారుడిపై జరిగిన దాడికి సంబంధించిన అసలు నిజాన్ని వెల్లడించాడు. తన కుమారుడితో పాటు మరో ఆరుగురు కలిసి కొందరిని కొట్టారని తెలిపాడు.అయితే వాళ్లు జైలుకు వెళ్లి బెయిల్పై తిరిగి వచ్చారని.. ఆ కసితో తమ కుమారుడిని బాగా కొట్టారని చెప్పుకొచ్చాడు. ఆ దాడిలో కంటికి తీవ్రంగా దెబ్బ తగిలిందని, పళ్లు విరిగిపోయాయని చెప్పుకొచ్చాడు. పోలీసులు తమ కుమారుడిని కాపాడారని.. లేదంటే ఆ రోజు తన కొడుకు చనిపోయేవాడని తెలిపాడు. మొత్తానికి ఇంతకాలం శరత్ను హిజ్రాలు కొట్టారంటూ ఊహాగానాలు వినిపించాయి. కానీ ఈ వీడియోతో అసలు నిజం బయటకు వచ్చింది.