Samantha : స్టార్ హీరోయిన్ సమంత గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి కోలీవుడ్లో చక్కర్లు కొడుతోంది. అమ్మడు ఇప్పటికే కోలీవుడ్కి ఎంట్రీ ఇచ్చి మంచి సక్సెస్ను అందుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం సామ్ స్టార్ హీరో విజయ్తో తలపడబోతోందట. కోలీవుడ్లో ఇప్పటికే అమ్మడు విజయ్ సరసన తెరి, మెర్సల్, కత్తి వంటి సినిమాల్లో నటించి మంచి సక్సెస్ చిత్రాల్లో నటించి ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఇక నాగచైతన్యతో విడాకుల తర్వాత బోల్డ్గా నటించేందుకు ఈ బ్యూటీ నో చెప్పడం లేదని టాక్. చివరకు స్పెషల్ సాంగ్స్ను కూడా వదలకుండా చేసేస్తోంది.
Samantha : విజయ్ 66వ చిత్రంగా..
ఇక అమ్మడుకి సంబంధించి ఆసక్తికర విషయం ఏంటంటే.. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న వారీసు(తెలుగులో వారసుడు) చిత్రంలో విజయ్ నటిస్తున్నాడు. ఈ సినిమాలో సామ్ ప్రతినాయకి పాత్రలో నటించనుందని టాక్. ఇది విజయ్ 66 చిత్రంగా రూపొందబోతోంది. విజయ్ను ఢీకొనే ప్రతినాయకి పాత్రలో సామ్ నటిస్తోందిని కోలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నారు. ఇదే నిజమైతే అమ్మడు ఆల్ రౌండర్గా మారడం ఖాయం. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ శకుంతలం, యశోద వంటి హీరోయిన్ సెంట్రిక్ కథా చిత్రాల్లో నటిస్తోంది.
మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరంలో నిర్వహించే ప్రతిష్ఠాత్మక ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్కు సమంత ముఖ్య అతిథిగా ఆహ్వానం అందుకుంది. ఆగస్ట్ 12 నుంచి ఈ వేడుకు ప్రారంభం కానుంది. గత రెండేళ్లుగా ఈ కార్యక్రమం కరోనా కారణంగా జరగలేదు. తిరిగి ఈ ఏడాది ప్రారంభం కానుంది. ఈ ఫెస్టివల్కు సామ్ హాజరై తనకు ఇండస్ట్రీతో ఉన్న అనుబంధాన్ని ఇతర విషయాలను పంచుకోనుంది. సామ్కు ఇలాంటి అరుదైన గౌరవం దక్కడం ఇండియన్ ఇండస్ట్రీలోనే హాట్ టాపిక్గా మారింది. ఆస్ట్రేలియాలోని విక్టోరియా స్టేట్ రాజధాని నగరంలో సామ్ సినీ ప్రియుల్ని కలవనుంది. భారతీయ సినిమా ప్రతినిధిగా ఒక అంతర్జాతీయ చిత్రోత్సవానికి ప్రాతినిధ్యం వహించనుండడం తనకు చాలా గర్వంగా ఉందని సమంత వెల్లడించింది.