Jack Fruit
ప్రస్తుతం పనస పండు ఎక్కడపడితే అక్కడ దొరుకుతోంది. ‘విజిటబుల్ మీట్’ అని ముద్దుగా పిలుచుకునే ఈ పండు మనదేశంతో పాటు బంగ్లాదేశ్, ఫిలిప్పీన్స్, శ్రీలంకలో విపరీతంగా కాస్తుంది. సైజులో కూడా ఈ పండు కింగ్. ఇక దీనిలో ప్రొటీన్లు, న్యూట్రిన్లు పుష్కలంగా లభిస్తాయి. అసలు నిజం చెప్పాలంటే పనస పండు విత్తనాలు కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఎన్ని లాభాలో తెలిస్తే ఆశ్చర్యం వేస్తుంది. అసలు పనస గింజల ధర.. ఆల్మండ్స్తో పోటీ పడుతుంది. దీనికి కారణం వీటికున్న డిమాండ్, ఇవి చేసే మేలు. విత్తనాలు ఏం మేలు చేస్తాయి? ఎలా మేలు చేస్తాయనే దానిపై ఓ లుక్కేద్దాం.
మానసిక ఒత్తిడి తగ్గిపోతుంది
పనసపండు విత్తనాలను ఆవుపాలు లేదా గేదెపాలలో (పచ్చిపాలు )రెండు స్పూన్లు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించుకుంటే కాంతివంతంగా తయారవుతుంది. పనస గింజల్లో ప్రొటీన్లు, మైక్రో న్యూట్రిన్లు అధికంగా ఉండటం వల్ల వీటిని తీసుకుంటే మానసిక ఒత్తిడి తగ్గిపోతుంది. కొన్ని రకాల చర్మ వ్యాధులు పోవడమే కాకుండా జుట్టు పెరుగుదలలోనూ సహకరిస్తుంది. ఇందులో ఐరన్శాతం ఎక్కువ. అనీమియాతో పాటు ఇతర రక్తసంబంధ వ్యాధులు రాకుండా చేస్తుంది. ఈ గింజలు గుండెకు.. కంటికి కూడా చాలా మంచింది.
పనస తొనలలో ఉండే విత్తనాలకు మార్కెట్లో డిమాండ్ ఉంటుంది. పనస గింజల బిర్యానీ అదిరిపోయే టేస్ట్ ఉంటుంది కాబట్టి దాదాపు చాలా మందికి ఇది ఒక్కటి మాత్రమే తెలుసు. నిజానికి మార్కెట్లో ఈ గింజల పిండి దొరుకుతుంది. థయామిన్, రైబోఫ్లోవిన్ పుష్కలంగా లభిస్తుంది. ఈ పిండిని ఎలాగోలా మనం తీసుకోగలిగితే సత్వర శక్తి వస్తుంది. అంతేకాదు.. జీర్ణాశయంలోని ఆహారం త్వరగా అరగడమే కాకుండా జీర్ణాశయ సంబంధిత వ్యాధులను సైతం నయం చేస్తుంది. చైనాలాంటి దేశాల్లో పనసపండు విత్తనాల పొడిని జీర్ణాశయ సంబంధ వ్యాధులను నయం చేయటానికి ఉపయోగిస్తారు. పనస గింజలలో ప్రొటీన్లు బీభత్సంగా ఉంటాయి కాబట్టి కండరాలు సైతం ఆరోగ్యకరంగా ఉంటాయి.