జనవరి 27 నుంచి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కుప్పం నుంచి మొదలుకొని రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ పాదయాత్రపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. అయితే ఈ పాదయాత్రపై జీవో నెంబర్ 1తో ఆంక్షలు విధించాలని భావించారు. అయితే ఈ జీవోని హైకోర్టు అంగీకరించే అవకాశం ఉండకపోవచ్చు. అలాగే ఈ జీవోతో పాదయాత్ర మీద అనవసరమైన ఆంక్షలు విధిస్తే ప్రభుత్వం ప్రతిపక్షాలని అణచివేసే ప్రయత్నం చేస్తుందని ప్రజలలోకి బలంగా తీసుకెళ్ళే ఛాన్స్ ఇచ్చినట్లు అవుతుంది. గతంలో తాను పాదయాత్ర చేసిన సమయంలో టీడీపీ ప్రభుత్వం ఎలాంటి ఆటంకాలు సృస్టించలేదు.
అయితే ప్రస్తుతం తమకి ప్రజా బలం, మద్దతు ఉన్న నేపధ్యంలో లోకేష్ పాదయాత్ర చేసిన కూడా ఆ పార్టీకి పెద్దగా ఒరిగేది ఉండదనే ఆలోచనతో జగన్ అండ్ కో ఉన్నట్లు రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది. ఈ నేపధ్యంలో పాదయాత్రపై అనవసరమైన ఆంక్షలు విధించి కొత్త తలనొప్పులు ఎందుకు తెచ్చుకోవడం అనే ఆలోచనతో జగన్ ఉన్నట్లు తెలుస్తుంది. ఈ నేపధ్యంలోనీ తమ నాయకులకి కూడా లోకేష్ పాదయాత్రని పట్టించుకోవద్దని స్పష్టంగా చెప్పినట్లు తెలుస్తుంది.
ఒక వేళ అనవసరమైన కామెంట్స్ ఏమైనా చేస్తే అప్పుడు మాత్రమే రియాక్ట్ కావడంతో పాటు పోలీసులని దించి శాంతిభద్రతలకి విఘాతం కలిగించే దిశగా పాదయాత్ర సాగుతుందని ప్రజలలోకి తీసుకెళ్ల వచ్చని జగన్ అనుకుంటున్నట్లు టాక్ అందులో ఆరంభంలో లోకేష్ పాదయాత్రకి ఎలాంటి ఆటంకం కలిగించకుండా వదిలేయాలని జగన్ నాయకులకి చెప్పినట్లు సమాచారం. అయితే పరిస్థితుల బట్టి పాదయాత్ర మధ్యలో నిర్ణయాలు తీసుకోవచ్చని కూడా క్లారిటీ ఇచ్చినట్లు బోగట్టా. అలాగే పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర విషయంలో సిచువేషన్ బట్టి నిర్ణయాలు తీసుకొని ఎలా వారి మైలేజ్ పెరగకుండా కట్టడి చేయాలనే విషయంపై ఆలోచిద్దామని పార్టీ నాయకులకి సూచించినట్లు టాక్.