విడాకులు ఇస్తానని భర్త విష్ణుని భయపెట్టి చెప్పుచేతల్లో పెట్టుకుంటుంది మల్లిక. అందుకే భయపెట్టి మరి చికెన్ తెప్పించుకుని తమ గదిలో తింటూ ఉంటుంది. అంతేకాకుండా అత్తని నోటికి వచ్చినట్లు తిడుతూ ఉంటుంది. అది చూసిన జ్ఞానాంబకి కోపం వస్తుంది. దాంతో రెండు రోజులు ఏం తినకుండా ఉండేలా శిక్ష వేస్తుంది. అనంతరం జానకి ఐపిఎస్ చదువుకి ఏర్పాట్లు చేసిన జ్ఞానాంబ.. కోడలుతో కలిసి ఇన్స్టిట్యూట్కి వెళుతుంది. ఆ తర్వాత ఆగస్టు 12 ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దాం..
జానకిని ఇన్స్టిట్యూట్కి తీసుకెళ్లిన అక్కడి విద్యార్థులను అడిగి ప్రిన్సిపల్ దగ్గరకి వెళుతుంది జ్ఞానాంబ. కోడలిని ప్రిన్సిపల్కి పరిచయం చేస్తుంది జ్ఞానాంబ. అసిస్టెంట్ని పిలిచి అడ్మిషన్ ఫామ్ తెప్పించి జానకిని ఫిల్ చేయమంటుంది. అనంతరం ప్రిన్సిపల్.. ‘పల్లెటూర్లో అత్తింటి వాళ్లు కోడళ్లని చదువుకోవడానికి ఒప్పుకోరు. కానీ మీ అత్త ఒప్పుకోవడం చాలా గ్రేట్’ జానకితో అంటుంది. అది విని అత్తని చూస్తూ గొప్పగా ఫిలవుతుంది జానకి. అనంతరం నామినల్ ఫీజు కట్టమని చెబుతుంది ప్రిన్సిపల్. రామా వెళుతుండగా.. అతన్ని మీరు ఇక్కడి పని చూడండి.. మేం ఫీజు కట్టోస్తామంటూ జ్ఞానాంబ, గోవిందారాజులు వెళతారు.
మరోవైపు.. అదే కాలేజ్లో జెస్సీ స్నేహితులతో సరాదా మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి ఓ అమ్మాయి లంగావోణిలో వస్తుంది. అది చూసిన జెస్సీ.. ‘పోలేరమ్మ లాగా ఉన్నావే. నువ్వు కాలేజ్కి వచ్చవా లేక పెళ్లి చూపులకి వచ్చావా’ అంటూ హేళన చేస్తుంటుంది. అప్పుడు అటుగా వచ్చిన జ్ఞానాంబ, గోవిందారాజులు అది చూస్తారు. ఆ అమ్మాయి మా ఇంట్లో పూజలు జరుగుతాయి. అందుకే మా అమ్మ అలాగే వెళ్లమని చెప్పడం వల్ల వచ్చానని అంటుంది. దానికి జెస్సీ.. ‘మీ అమ్మ చెబితే ఇలాగే వచ్చేస్తావా. కుదరదని చెప్పావా. నాకు భవిష్యత్తులో పెళ్లైన నాకు ఇష్టమైనట్లే ఉంటా. అత్తింటివాళ్లు బలవంతం చేస్తే కేసు పెడతా. లేదంటే మా ఆయనతో వేరు కాపురం పెడతా’ అని ఓ రేంజ్లో డైలాగులు కొడుతుంది. అది విన్న జ్ఞానాంబకి కోపం నషాళానికి అంటుతుంది. అలాగే ఇలాంటి వాళ్లతో జానకి స్నేహం చేస్తే చెడిపోతుందని భయపడుతుంది. దానికి మన జానకి ఒకరికి చెప్పేరకమే కానీ చెప్పించుకునే రకం కాదని సమాధానపరుస్తాడు గోవిందారాజులు.
ఎవరికైతే తెలిస్తే కొంపలు మునుగుతాయని భయపడ్డామో అలాంటి జ్ఞానాంబనే సపోర్టు చేయడం గురించి మాట్లాకుంటూ సంతోషపడతారు జానకి రామా. ఫీజు కట్టిన వచ్చిన తర్వాత గోవిందారాజులు జానకితో.. ‘ అమ్మా జానకి.. నీకు నచ్చిన చదువుని బాగా చదువుకో.. నీ కలని.. మీ చిన్ననాటి ఆశల్ని నిజం చేసుకోమని చెబుతాడు గోవిందరాజులు చెప్తాడు. అతని మాటలు విని చాలా ఎమోషనల్ అవుతుంది జానకి.
‘అత్తయ్యగారూ.. మీరు ఎంతోమంది పిల్లలని చదివించడం వల్లే.. సమయం అయిపోయినప్పటికీ మీ మీద గౌరవంతో నాకు సీటు ఇచ్చారు.
నేను ఇక్కడ చదవుకోవడం మీరు పెట్టిన భిక్ష.. మీ ప్రేమకి అభిమానానికి ఎప్పటికీ రుణపడి ఉంటాను అత్తయ్య గారూ’ అని అత్త కాళ్లపై పడుతుంది జానకి. దీంతో జ్ఞానాంబ.. ‘మళ్లీ మళ్లీ చెప్తున్నాను.. కేవలం నా బిడ్డ బాధ చూడలేకే నీ చదువుకి ఒప్పుకున్నా.. నా కొడుక్కి ఏమౌతుందో అన్న భయం వెంటాడుతునే ఉంది.. నీకు జీవితంలో చదువు ఒక భాగం కావాలి కానీ.. చదువే జీవితం కాకూడదు.. కుటుంబానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలి.. సంసారానికి కట్టుబడి ఉండాలి. నీ బాధ్యత నేను నెరవేర్చాను.. నీ బాధ్యత నువు నెరవేర్చు’ అని అంటుంది జ్ఞానాంబ. ఖచ్చితంగా మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను అని అంటుంది జానకి.
జానకి క్లాసుకి వెళుతుండగా.. మిగిలిన వారందరూ ఇంటికి వెళ్లడానికి కారు దగ్గరకి వస్తారు. అప్పుడే జెస్సీ.. కంగారుగా వెళ్తూ.. సెక్యురిటీ గార్డ్ చేతిలో ఉన్న అన్నం బాక్స్ని నేలపాలు చేస్తుంది. అది జ్ఞానాంబ కంట పడుతుంది. దాని అహంకారాన్ని అణచి వస్తానని చెప్పి.. జెస్సీ దగ్గరకు వెళ్తుంది జ్ఞానాంబ.
‘ఏ పిల్ల కళ్లు ఎక్కడ పెట్టుకుని నడుస్తున్నావే.. ఎదురుగా వస్తున్న మనుషులు కనిపించడం లేదా? నీకు కళ్లు నెత్తికి ఎక్కాయే.. తల పొగరుని.. ఒంటి కొవ్వుని తగ్గిస్తా.. అన్నం నేలపాలు చేసి జాలిలేకుండా వెళ్లిపోతున్నావ్.. ఏం సంస్కారమే నీది?. మీ అమ్మనాన్న సరిగ్గా పద్దతి నేర్పకపోవడం వల్లే ఇలా తయారయ్యావు ’ అని జెస్సీని కొట్టబోతుంది జ్ఞానాంబ. అప్పుడే రామా, గోవిందారాజులు పట్టుకొని ఆపుతారు. దాంతో.. ‘ ఇంత గయ్యాలిలా ఉన్నారు.. మీతో మీ కోడళ్లు ఎలా వేగుతున్నారో’ అని జెస్సీ అంటే.. ‘నీలాంటి కోడలే నాకొస్తే పట్టపగలే చుక్కలు చూపిస్తానని అంటుంది జ్ఞానాంబ. దానికి సమాధానంగా నీలాంటి అత్త నాకు వస్తే.. ముప్పుతిప్పలు పెట్టి.. మూడు చెరువుల నీళ్లు తాగిస్తా అని అంటుంది జెస్సీ. ఇదంతా చూస్తుంటే భవిష్యత్తులో జ్ఞానాంబకి కాబోయే చిన్న కోడలు ఈ గడుసు పిల్లేనని అనిపిస్తోంది.
ఇక మల్లికని రెండు రోజుల పాటు ఏమీ తినకూడదని జ్ఞానాంబ శిక్ష వేసిన విషయం తెలిసిందే. జానకికి కాలేజ్కి వెళ్లేప్పుడు మల్లికని తినకుండా చూడమని చికితాని కాపలా పెడుతుంది జ్ఞానాంబ. చికితాలేని సమయం చూసి తినడానికి ప్రయత్నం చేస్తుంది మల్లిక. అప్పుడే చికితా రావడంతో కంగారుపడుతుంది. కానీ.. మెదడు ఉపయోగించి తన దగ్గర వాసన వస్తుందని చెప్పి చికితాని స్నానానికి వెళ్లేలా చేస్తుంది మల్లిక. చికితా అలా వెళ్లగానే పళ్లెంలో అన్నం పెట్టుకొని గబగబా మెక్కుతూ ఉంటుంది. అప్పుడే జ్ఞానాంబ రావడంతో కంగారు పడి అన్నం పళ్లేన్ని వెనుకపెట్టి కవర్ చేస్తుంది. అత్త వచ్చి ఏం అడిగిన సమాధానం చెప్పకుండా సైగలు చేస్తుంటుంది. అయితే గోవిందారాజులు మాత్రం అస్సలు విషయాన్ని కనిపెట్టేస్తాడు. కాగా.. మల్లిక అత్తకి దొరికిపోయి మళ్లీ చివాట్టు తిటుందా.. అలాగే జెస్సీ జానకి కలగనలేదు కథలో ఎలాంటి మలుపులు తీసుకొస్తుందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకూ ఆగాల్సిందే.