కండిషన్లు పెట్టి మరి జానకి ఐపీఎస్ చదవడానికి ఒప్పుకుంటుంది జ్ఞానాంబ. జానకి వాటికి ఒప్పుకుంటుంది. అంతలోనే కేవలం ఐదే అవకాశాలు ఇస్తుంది. తప్పు చేసిన ప్రతిసారి ఒక్కో అవకాశం పోతుందని వార్నింగ్ ఇస్తుంది జ్ఞానాంబ. ఎలాగైనా త్వరగా జానకి ఐదు తప్పులు చేసేలా చేసి తన ఐపీఎస్ కలకి అడ్డుపడాలని అనుకుంటుంది మల్లిక. అందుకే జానకి పుస్తకాలను అత్త ఎంతో భక్తిగా చూసుకొనే తోరాలను స్థానంలో పెడుతుంది. అవి కింద పడి ఉండడం చూసి జ్ఞానాంబ కోపం నషాళానికి అంటుతుంది. దాంతో జానకిని అరస్తూ పిలుస్తుంది. ఆ తర్వాత ఆగస్టు 9న ఏం జరిగిందో చూద్దాం..
ఈ పుస్తకాలు నీవేనా అని జ్ఞానాంబ అడగడంతో.. ఏం అర్థం కానీ జానకి తనవే అని చెబుతుంది. దాంతో తొక్క తాచుపాములా అయిన జ్ఞానాంబ తోరాలను చూపిస్తూ.. ‘ఇవేంటో, వీటి వీలువెంటో నీకు తెలుసా. మన వంశం కొనసాగడానికి పరమేశ్వరుడు వీటిని కానుకగా ఇచ్చాడు. అంత పవిత్రమైన తోరాలను కిందపడేస్తావా’ అని అరుస్తుంది. దాంతో మల్లిక మధ్యలోకి దూరుతూ.. ‘ఐపీఎస్ అవ్వబోతోంది కదా అత్తయ్యగారు.. అందుకే అహం చూపిస్తోంది’ అని దెప్పిపొడుస్తుంది. అది విని మల్లిక అస్సలు విషయం తెలుసుకోకుండా మాట్లాడకని జానకి కసురుకుంటుంది. దాంతో జ్ఞానాంబ మరింత కోపంగా.. ‘తోరాలు ఉండాల్సిన చోట నీ పుస్తకాలు ఉన్నాయి. ఇంకా ఏం తెలుసుకోవాలి. నేను చెప్పినట్లు ఆచారాలకు విలువ ఇవ్వలేదు. ఇంకా భర్తకు ఏం విలువ ఇస్తావు’ అని కోపంగా అరుస్తుంది.
ఇదే సంధు అనుకొని మల్లిక ఒక తప్పు చేసేంది అంటూ స్వయంగా మల్లికనే ఒక సంఖ్యని కొట్టేయబోతుంది. అదే తను చేసిన తప్పు. మల్లికని పిలిచి నువ్వు కొట్టేసిన నా నెక్లెస్ ఎక్కడా అని అడుగుతుంది జానకి. దానికి నేను నీ నెక్లెస్ తీయడం ఏంటి అని ప్రశ్నిస్తుంది మల్లిక. నా నెక్లెస్కి పసుపు కుంకుమ రాసి గదిలోని బాక్సులో పెట్టాను. అదే ఇప్పుడు నీ చేతికి ఉందని అంటుంది జానకి. దానికి రెచ్చిపోయిన మల్లిక అది నీ నెక్లెస్ది కాదు. ఆ తోరాలను కిందపడేసేటప్పుడు అంటింది అర్థమైందా అని కోపంగా అంటుంది మల్లిక. అది విని అక్కడ ఉన్నవారందరూ షాకై పోతారు. గోవిందారాజులు అర్థమైందమ్మా అందరికీ బాగా అర్థమైందని వెటకారంగా అంటాడు. అప్పటికీ గానీ మల్లికకి తను చేసిన తప్పేంటో అర్థం కాదు.
తోరాలు కిందపడేసింది జానకి కాదు.. మల్లిక అనే నిజం తెలియడంతో జ్ఞానాంబ ఆగ్రహంతో ఊగిపోతుంది. చేసేది లేక జ్ఞానాంబ కాళ్లపై క్షమించమని వేడుకుంటుంది మల్లిక. జానకి ఐపీఎస్ చదవడానికి ఒప్పుకున్నారు.. కానీ నేను మా ఆయన పట్నం వెళ్తాం అంటే మాత్రం ఒప్పుకోలేదనే బాధతోనే ఇలా చేశాను. అర్ధం చేసుకోండి.. నన్ను కొట్టొద్దు అని ప్రాధేయపడుతుంది మల్లిక. దీంతో జ్ఞానాంబ.. ముందు పైకి లే అని చిరాకు పడుతుంది. అయినా మల్లిక లేవకపోవడంతో బలవంతంగా లేపి కొట్టబోతుంది. అప్పుడే వద్దు జ్ఞానం అంటూ గోవిందరాజులు అడ్డుకుంటాడు. ‘ఛీ.. నీ తోటికోడలు.. సాటి ఆడదనే జ్ఞానం లేకుండా ఇలాంటి నీఛమైన పని చేస్తావా?. ఎన్నిసార్లు చెప్పిన నువ్వు మారట్లేదు. ఇలా చేస్తుంటే ఎదుటివాళ్ల మనస్సు ఎంత బాధపడుతుందోనని ఇంగితం కూడా లేదు. ఇకనైనా మారు’ అని మల్లికపై విరుచుకుపడుతుంది జ్ఞానాంబ. అనంతరం.. ‘నిన్ను అపార్ధం చేసుకున్నాను.. నన్ను క్షమించు జానకి’ అని అంటుంది జ్ఞానాంబ. పర్లేదు అని అత్తయ్యగారూ అని జానకి అనడంతో.. ఆ తోరాలను జానకికి ఇచ్చి.. నీ చేతులతో లోపల పెట్టమని జానకికి అప్పగిస్తుంది జ్ఞానాంబ. అలాగే మల్లికని చిరాకుగా ఓ చూపు చూసి అక్కడి నుంచి వెళ్లిపోతుంది జ్ఞానాంబ. విష్ణు కూడా ఎదో తలకమాసిన పని చేసి తిట్లు తింటూనే ఉంటావ్ కదా అని కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
ఆ తర్వాత బట్టల కొట్టులో విష్ణు పని చేసుకుంటూ ఉంటాడు. అక్కడికి వస్తుంది మల్లిక. నాకు విడాకులు కావాలి లాయర్ దగ్గరకి వెళదాం పదండి అంటుంది. మీతో నేను ఉండలేను.. అమ్మ ఏం చేసినా.. చిత్తం అని చేయి ఎత్తడానికి తప్ప.. పెళ్లం చేయి పట్టుకోలేవని నాకు అర్ధం అయ్యింది. ఓ పక్కన మీ అన్నయ్య, మీ వదినను మీ అమ్మకి చెప్పకుండా చదివిస్తున్నాడు.. మీరు నాకు చిన్న సాయం చేశారా?. కూర బాలేదనే మొగుడితోనైనా కాపురం చేయొచ్చు కానీ.. అత్త కోడలు గొడవలో భార్యకి సపోర్టు చేయని మొగుడితో కాపురం చేయలేం. పెళ్లం మాట వింటారా? లేదంటే విడాకులు ఇస్తారా? అని గట్టిగా అడుగుతుంది మల్లిక. నువ్ నాకు ఒట్టు వేస్తేనే నీతో ఉంటానని మల్లిక అనడంతో.. తప్పదు అన్నట్టుగా విష్ణు మల్లికకు ఒట్టు పెడతాడు. దాంతో మల్లిక రెచ్చిపోతూ అత్తగారికి నచ్చదని తెలిసి కూడా చికెన్ బిర్యానీ తెమ్మని ఆర్డర్స్ పాస్ చేసి అక్కడి నుంచి వెళ్లిపోతుంది మల్లిక.
మరోవైపు రామా స్వీట్ షాపులో పని చేస్తూ.. తల్లి జానకికి పెట్టిన షరతుల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. కస్టమర్స్కి చిల్లరకి బదులు నోట్లు ఇస్తాడు. అప్పుడే భోజనం పట్టుకొని అక్కడికి వస్తుంది జానకి. ఏం అలా ఉన్నారని అడిగితే.. ఉదయం జరిగిన విషయం గురించే మాట్లాడతాడు. ఏం సమస్య రాకుండా తను చూసుకుంటానని జానకి చెప్పి భోజనం వడిస్తుంది. ఉదయం జరిగిన గొడవ కారణంగా టిఫిన్ కూడా చేయరు జానకి రామా. దాంతో.. రామానే ప్రేమగా ముద్దలు కలిసి జానకికి తినిపిస్తుంటాడు. మెల్లగా విష్ణుని తన దారిలోకి తెచ్చుకున్న మల్లిక ఎన్ని పన్నాగాలు పన్నుతుందో చూడాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకూ ఆగాల్సిందే.