స్టార్ మా లో గత ఐదేళ్ల నుంచి ప్రసారం అవుతున్న నెంబర్ వన్ సీరియల్ కార్తీకదీపం. సూపర్ హిట్ రేటింగ్ తో ప్రతి రోజు టీవీ ప్రేక్షకులని ఈ సీరియల్ అలరించింది. రియాలిటీషోలు, సినిమాలు టెలికాస్ట్ అయినా వాటిని బీట్ చేసే విధంగా సీరియల్ రేటింగ్స్ కొనసాగాయి అంటే ఎంత సూపర్ హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇదిలా ఉంటే ఈ సీరియల్ నాలుగు నెలల క్రితం కీలక పాత్రలైనా కార్తిక్, దీప రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్లు చూపించారు. ఆ తర్వాత సీరియల్ రేటింగ్స్ తగ్గడంతో కొత్త జనరేషన్ తో ఇన్ని రోజులు కొనసాగించి మరల ఫ్లాష్ బ్యాక్ లోకి తీసుకెళ్లారు.
కార్తిక్, దీప బ్రతికే ఉన్నట్లు చూపించారు. ఇక సరికొత్తగా ఈ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ తో సీరియల్ ని కొనసాగించడానికి దర్శక, నిర్మాతలు సిద్ధం అయ్యారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సీరియల్ గురించి మరో ఆసక్తికర అప్డేట్ కూడా వచ్చింది. సీరియల్ లోని కీలక సన్నివేశాలని కలిపి దీనిని ఒక సినిమాగా తీసుకురావాలనే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటి వరకు ఇలా ఒక సీరియల్ లోని ఎపిసోడ్స్ లో సన్నివేశాలని ఎడిట్ చేసి రెండు గంటల సినిమాగా ఎవరూ చూపించే ప్రయత్నం చేయలేదు.
కానీ కార్తీక దీపం సీరియల్ ని మాత్రం అలా సినిమాగా తీసుకురాబోతున్నారు. ముందుగా దీనిని థియేటర్స్ లో రిలీజ్ చేసి తర్వాత ఓటీటీలో ప్రసారం చేయాలని భావిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ కార్తీక దీపం ఓటీటీ స్ట్రీమింగ్ కోసం నెట్ ఫ్లిక్స్ తో ఒప్పందం కూడా చేసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. మరి ఇందులో వాస్తవం ఏంటి అనేది తెలియాలంటే అధికారికంగా కన్ఫర్మ్ అయ్యి బయటకి వచ్చే వరకు వేచి చూడాలి. ఇక కార్తీక దీపం సినిమాని రెండు గంటల నిడివిలో తీసుకొస్తారా లేక మూడు గంటల మూవీగా చూపించబోతున్నారా అనేది తెలియాల్సి ఉంది.