గత రెండు రోజులుగా కార్తీక దీపంలో ఫ్లాష్ బ్యాక్ నడుస్తోంది. కోమాలోంచి బయటికి వచ్చిన దీపని అక్కడి డాక్టర్ సొంత చెల్లెళ్ల భావించి ఇంటికి తీసుకెళతాడు. డాక్టర్ తల్లి కూడా వంటలక్కని సొంత కూతురిలా ఆదరిస్తుంది. మరోవైపు సౌర్యని ఒప్పించి హైదరాబాద్లోని సౌందర్య దగ్గరకి తీసుకెళుతుంటారు గండ, చంద్రమ్మ. సౌర్య, దీప తెలియకుండా హైదరాబాద్ వెళ్లేందుకు ఒకే బస్సు ఎక్కుతారు. మరోవైపు సౌందర్య, ఆనందరావు, హిమ అమెరికా వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటారు. ఆ తర్వాత ఆగస్టు 18 ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దాం..
కార్తీక్, దీప ఫొటోలను గోడ మీద నుంచి తీస్తూ ఎమోషనల్ అవుతుంది సౌందర్య. భరించలేని బాధని వదిలి.. మీరు మాత్రం వదిలి వెళ్లిపోతే.. జీవితాంతం ఎలా బతికేదని బాధగా కన్నీరు పెట్టుకుంటుంది సౌందర్య. అంతేకాకుండా.. కార్తీక్, దీప కలవకపోయిన కొట్టుకుంటూ అయినా కళ్లముందు ఉంటే చాలని అనిపిస్తుందని భర ఆనందరావుతో ఆవేదనగా అంటుంది సౌందర్య. అనంతరం సౌర్య దొరుకుతుందనే ఆశతో.. ఆ ఇంటిని అమ్మేసి అప్పటికే రెడీగా ఉన్న క్యాబ్లో అక్కడి నుంచి వెళ్లిపోతారు సౌందర్య, ఆనందరావు, హిమ.
అనంతరం ఒకే బస్సులో హైదరాబాద్కి ప్రయాణం చేస్తుంటారు దీప, సౌర్య. అప్పడే.. ‘నాన్నతో కలిసి సంతోషంగా ఉందామనుకుంటే.. నువ్వు కూడా దూరమయ్యావు ఎంటమ్మా’ అనుకుంటూ దీపని తలచుకుని ఎమోషనల్ అవుతుంది సౌర్య. అనంతరం బస్సులో ఓ దాబా దగ్గర ఆగుతుంది. దాంతో సౌర్య బన్ను తింటూ గొంతుకు అడ్డం పడడంతో వాటర్ బాటిల్ కోసం వెళుతుంది చంద్రమ్మ. అదే సమయంలో సౌర్య పక్కగా అదే షాపుకి వాటర్ బాటిల్ కోసం వెళుతుంది దీప. చిల్లర లేకపోవడంతో ఇబ్బందిపడుతుంటుంది చంద్రమ్మ. దాంతో ఆ బాటిల్కి కూడా తనే డబ్బులు ఇచ్చి పాపకి అమ్మ ఇచ్చిందని చెప్పు అంటుంది దీప. దీంతో అది తీసుకొని సౌర్యకి ఇచ్చి జరిగిన సంగతి చెబుతుంది చంద్రమ్మ. దాంతో ఆమెకి థ్యాంక్స్ చెప్పాలంటుంది సౌర్య. ఆవిడ కూడా వాళ్లతో పాటు బస్సులో వస్తుందని చెప్పిన చంద్రమ్మ తర్వాత చెబుదువులే అని చెబుతుంది. దాంతో బస్సుకి ఎక్కిన తర్వాత ఆ అమ్మ ఎవరనీ అడగగా నిద్రపోతుందని .. తర్వాత మాట్లదువులే అని చంద్రమ్మ చెప్పగా.. కొద్దిసేపటికి నిద్రలోకి జారుకుంటుంది సౌర్య. అనంతరం డాక్టర్, నర్సుతో దీప గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఆమె ఎక్కడుందని అడగగా.. హైదరాబాద్ వెళ్లిందని చెబుతాడు డాక్టర్. ఆమె కుటుంబంతో కలవాలని కోరుకుంటారు.
నిద్రపోతున్న సౌర్యపై దుప్పటి కప్పుకొని నిద్రపోతుంటుంది. అంతలోనే బస్సు హైదరాబాద్లో ఆగుతుంది. దీంతో దీప దిగుతూ ఉండగా.. సౌర్య చేయి దీపకి అడ్డు వస్తుంది. దాంతో.. ‘మీరు వాటర్ కొన్నిచ్చింది తన కోసమే. మీకు థ్యాంక్స్ చెప్పాలనుకుంది’ అని చెబుతుంది చంద్రమ్మ. పర్లేదమ్మా.. అంటూ సౌర్య తలని ప్రేమగా నిమిరి.. చేతిని పక్కకి తీసి బస్సు దిగి వెళ్లిపోతుంది. ఆ తర్వాత కొద్దిసేపటికి నిద్ర లేచిన సౌర్య.. దీప గురించి అడుగుతుంది. వెళ్లిపోయిందని చెప్పడంతో బాధగానే బస్సు దిగి దీప ఉన్నవైపు కాకుండా మరోవైపు వెళ్లి ఆటో ఎక్కుతారు.
ఇక సౌర్యని ఆటో ఎక్కించుకుని సౌందర్య ఇంటికి బయలుదేరతారు చంద్రమ్మ, గండ. అయితే వాళ్లు ఇద్దరూ సౌర్యని కూల్ చేయడానికి.. ‘నిన్ను చూడగానే మీ వాళ్లు ఎగిరి గంతేస్తారు.. చాలా సంతోషిస్తారు.. మా గురించి నువ్వేం ఆలోచించకు తల్లీ.. మేము అసలు నీకు పరిచయం కాలేదు అనుకో’ అంటూ మాట్లాడుతూ ఉంటారు. ఆ మాట సౌర్య కోపానికి కారణం అవుతుంది. దాంతో ఇలా మాట్లాడితే.. బావుండదని వారిని హెచ్చరిస్తుంది సౌర్య. అది చూసి.. కోపం వద్దు బంగారం. ఏదో మాట వరుసకి అన్నానని నచ్చచెప్పే ప్రయత్నం చేస్తాడు గండ. ఇంటికి వెళ్లాక చాలా సంతోషంగా ఉంటేనే.. మేము ఆనందంగా ఊరికి తిరిగి వెళ్లగలమని చెబుతారు. దాంతో.. ఎందుకు ఊరికే ఇల్లు అని అంటున్నారని అరుస్తుంది సౌర్. అనంతరం నిన్న ప్రొమోనే తరువాయి భాగంలో వచ్చింది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకూ ఆగాల్సిందే.