ఉప్పెన సినిమాతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి మొదటి చిత్రంతోనే కుర్రకారు గుండెలని తాకిన అందాల భామ కృతి శెట్టి. ఇక ఈ సినిమా తర్వాత ఊహించని విధంగా ఈ అమ్మడు అవకాశాలని సొంతం చేసుకుంటుంది. ఉప్పెన తర్వాత నానికి జోడీగా శ్యామ్ సింగరాయ్ సినిమాలో అవకాశం సొంతం చేసుకున్న ఈ అమ్మడు రెండో సినిమాతో కూడా సక్సెస్ అందుకుంది. ఇక తరువాత ఇక తాజాగా ది వారియర్ సినిమాతో రామ్ కి జోడీగా మరోసారి ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ సినిమా కూడా ప్రస్తుతం పర్వాలేదని టాక్ తోనే నడుస్తుంది. మరో మూడు సినిమాలు ఈ అమ్మడి ఖాతాలో ఉన్నాయి. వాటిలో నాగ చైతన్య సినిమా కూడా ఒకటి కావడం విశేషం.
అలాగే సుధీర్ బాబుకి జోడీగా నటిస్తున్న ఆ అమ్మాయికి తప్ప మూవీ షూటింగ్ దశలో ఉంది. ఇంద్రగంటి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇదిలా ఉంటే ఈ అమ్మడు సినిమా సినిమాకి గ్లామర్ డోస్ పెంచుకుంటూ పోతుంది. మొదటి సినిమాలో కాస్తా పద్దతిగా కనిపించింది వారియర్ మూవీలో మాత్రం పాటలలో అందాల ప్రదర్శన చేసింది. ఇక సినిమాలో బోల్డ్ సన్నివేశాలపై ఈ అమ్మడు తాజాగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. రొమాంటిక్, బోల్డ్ సన్నివేశాలు చేయడంలో తనకి పెద్ద అభ్యంతరం లేదని చెప్పుకొచ్చింది. సినిమాలో యాక్షన్ సన్నివేశాలు ఎలాగో బోల్డ్ సన్నివేశాలు కూడా అంతే అని ఈ అమ్మడు ఎవరూ చెప్పని కొత్త అర్ధం చెప్పింది.
సినిమాలో కథ డిమాండ్ బట్టి ఏ సన్నివేశాలు అయినా ఉంటాయని, వాటిని చేయడంలో తనకు పెద్ద ఇబ్బంది లేదని పేర్కొంది. అనవసరంగా అలాంటి సన్నివేశాలు పెడితే మాత్రం కచ్చితంగా అభ్యంతరం చెబుతానని స్పష్టం చేసింది. మొత్తానికి ఈ అమ్మడు గ్లామర్ డోస్ పెంచడం వెనుక ఆమె ఫాలో అవుతున్న ఫిలాసఫీ కూడా ఉందని అర్ధమవుతుంది. ఈ అమ్మడు ఇంత క్లారిటీ ఇచ్చిన తర్వత మరిన్ని అవకాశాలు పెరిగే అవకాశం ఉందనే మాట వినిపిస్తుంది.