Mahesh Babu : వెండితెరపై హీరో, హీరోయిన్లుగా నటించి.. స్నేహం కాస్త ప్రేమగా చిగురించి.. నిజ జీవితంలో పెళ్లిబంధంతో ఒక్కటైన జంట మహేశ్బాబు-నమ్రత. 2000లో వచ్చిన వంశీ ద్వారా వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది. ఆ పరిచయమే చివరకు ప్రేమగా మారింది. ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది కానీ వీరిద్దరి జంట మాత్రం బ్లాక్ బస్టర్ హిట్. వంశీ షూటింగ్ సమయంలో చిత్ర యూనిట్ న్యూజిలాండ్ వెళ్లారు. దాదాపు 25రోజుల పాటు షూటింగ్ న్యూజిలాండ్లో జరిగింది. ఆ సమయంలోనే వీరి స్నేహం మరింత బలపడిందట. ఇక వీరిద్దరిలో ఎవరు ఫస్ట్ ప్రపోజ్ చేశారనే కదా.. మీ డౌట్.
నమ్రతే తొలుత మహేష్కు ప్రపోజ్ చేసిందట. న్యూజిలాండ్ షూటింగ్ నుంచి తిరిగి వచ్చాక నమ్రత మహేష్కు తన ప్రేమను తెలియపరించిందట. మహేష్కు కూడా నమ్రత అంటే చాలా ఇష్టం ఉండటంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. కానీ ఆయన ఇంట్లో వాళ్లు మాత్రం వీరిద్దరి పెళ్లికి రెడ్ సిగ్నల్ వేశారట. దీంతో మహేష్ సోదరి మంజుల రంగంలోకి దిగి.. అందరినీ ఒప్పించింద. మొత్తానికి వీరిద్దరూ 2005 ఫిబ్రవరి 10న పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు. ఇక పెళ్లి తర్వాత నమ్రత సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. బాలీవుడ్లో కెరీర్ పీక్స్లో ఉన్నప్పుడు నమ్రత సినిమాలకు గుడ్బై చెప్పడం విశేషం.
Mahesh Babu : ఆ విషయంలో ఎప్పుడూ రిగ్రెట్ అనిపించలేదు..
అయితే తనకు టాప్ హీరోయిన్ అవ్వాలన్న కోరిక ఎప్పుడూ లేదని.. మహేష్ను పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడే సినిమాలను వదిలేసుకున్నానని నమ్రత తెలిపారు. అయితే పెళ్లయి 17 ఏళ్లు అవుతున్నా కూడా ఏనాడూ తనకు ఈ విషయంలో రిగ్రెట్గా అనిపించలేదని నమ్రత. మహేష్ బాబు నిజానికి ఫ్యామిలీ మ్యాన్ అని అందరికీ తెలిసిన విషయమే. షూటింగ్.. ఆ వెంటనే ఇల్లు తప్ప మరో ప్రపంచం ఉండదు. ఫ్యామిలీతో ఎక్కువ సమయం గడుపుతాడు. మహేశ్ కుటుంబం కోసం ఏదైనా చేస్తాడు. అందుకే మహేశ్ అంటే తనకు ఎంతో ప్రేమ, ఆరాధన అని నమ్రత తెలిపారు. ఆయన్ను పెళ్లిచేసుకోవడమే పెద్ద వరంలా ఫీల్ అవుతుంటానని పేర్కొన్నారు.