Gautham Menon: ఎప్పటినుండో గౌతమ్ మీనాన్ దర్శకత్వంలో మహేష్ సినిమా రాబోతున్నట్లు అనేకమైన వార్తలు రావడం తెలిసిందే. ప్రేమకథలు తీయడంలో స్పెషలిస్ట్ డైరెక్టర్ గా గౌతమ్ మీనాన్ కి సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఉంది. ఈ దిశగానే 2010వ సంవత్సరంలో అక్కినేని నాగచైతన్య ఇంకా సమంతాతో కలిపి “ఏ మాయ చేసావే” అనే రొమాంటిక్ లవ్ స్టోరీ సినిమా చేశారు. ఈ సినిమా అప్పటిలో సూపర్ హిట్ అయింది. నాగచైతన్య కెరియర్ లో ఫస్ట్ హిట్ సినిమాగా నిలిచింది. హీరోయిన్ గా సమంతకి మంచి గుర్తింపు తీసుకొచ్చింది.
అయితే ఈ సినిమా స్టోరీ ఫస్ట్ మహేష్ బాబుకి చెప్పినట్లు ఇటీవల గౌతమ్ మీనన్ తెలియజేశారు. మేటర్ లోకి వెళ్తే గత కొంతకాలంగా నటుడిగా తమిళ మలయాళ చిత్రాలలో బిజీగా ఉన్న గౌతమ్ దర్శకుడిగా ఇటీవల లిటిల్ సూపర్ స్టార్ సింబుతో “ముత్తు” సినిమా తీశారు. ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమంలో మాట్లాడుతూ అసలు “ఏ మాయ చేసావే స్టోరీ”.. మొదట తమిళంలోనే తీయాలని అనుకున్న. అయితే తెలుగులో ఈ కథను మహేష్ బాబుకి వినిపించాలని ప్రయత్నాలు చేశా. ముందుగా మహేష్ సిస్టర్ మంజుల గారికి స్టోరీ వినిపించడం జరిగింది.
ఆ సమయంలో మంజుల గారు మహేష్ అసలు ఈ సినిమా చేస్తాడా..? లేదా..? అన్నది నాకు కూడా డౌట్ గానే ఉందని చెప్పారు. ఎలాగైతే మహేష్ బాబుకి స్టోరీ వినిపించా. కథ వినినా వెంటనే ఇది చాలా చిన్న స్టోరీ కదా అని అనేశారు. మనిద్దరం కలిసి సినిమా చేస్తే అంచనాలు వేరేలా ఉండాలి. అది యాక్షన్ సినిమా అయి ఉండాలి. అలాంటి కథ రెడీ చెయ్ కలిసి చేద్దామని అప్పుడు మహేష్ చెప్పారు. కచ్చితంగా రాబోయే రోజుల్లో మహేష్ బాబుతో సినిమా ఉంటుందని గౌతమ్ మీనన్ తెలిపారు.