కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తనయుడిగా టాలీవుడ్ లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకున్న నటుడు మంచు మనోజ్. మంచు మనోజ్ హీరోగా చేసిన మొదటి సినిమా దొంగదొంగది. ఈ మూవీ మోస్తారుగా ఆడింది. తరువాత అతని కెరియర్ లో బిందాస్ అనే సినిమా మాత్రమే బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చింది. ఇక కెరియర్ లో హిట్ అంటూ లేవనే చెప్పాలి. రెగ్యులర్ జోనర్ లో కాకుండా డిఫరెంట్ కథలతో ప్రయోగాలు చేయడం మంచు మనోజ్ కి ఇష్టం. ఈ నేపధ్యంలోనే ఎక్కువగా రిస్క్ ప్రాజెక్ట్స్ చేశారు. అలాగే కథల ఎంపికలో తనకంటూ ప్రత్యేకత ఉండేలా చూసుకునేవాడు. ఈ కారణంగా మంచు మనోజ్ కి ఫ్లాప్స్ ఎక్కువగా ఉన్న మంచి నటుడు అనే గుర్తింపు ఉంది.
ఇక మనోజ్ తన సినిమాలకి తానే ఫైట్స్ కంపోజ్ చేసుకుంటూ ఉంటాడు. ఇక చాలా కాలంగా మనోజ్ సినిమాలకి గ్యాప్ ఇచ్చాడు. కొత్త సినిమాని ఎప్పుడో ప్రకటించిన అది ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. అహం బ్రహ్మస్మి అనే టైటిల్ తో డిఫరెంట్ కాన్సెప్ట్ తో పాన్ ఇండియా లెవల్ లో ఈ మూవీ తెరకెక్కుతుంది. ఇదిలా ఉంటే మంచు మనోజ్ గత కొంత కాలంగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ చెల్లి భూమా మౌనికారెడ్డితో రిలేషన్ లో ఉన్నాడనే మాట వినిపిస్తుంది. మౌనికా రెడ్డికి పెళ్లి అయ్యి విడాకులు అయ్యింది. అలాగే మనోజ్ కి కూడా విడాకులు అయ్యింది. ఇక ఇప్పుడు వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారని గత కొంతకాలంగా ప్రచారం నడుస్తుంది.
ఎక్కడ చూసిన ఇద్దరూ కలిసి కనిపిస్తూ ఉండటం ఈ వార్తలకి బలం చేకూరేలా ఉంది. తాజాగా మనోజ్ కడప దర్గాని దర్శించుకున్నారు. అక్కడ కూడా మనోజ్ తో పాటు మౌనికా రెడ్డి పక్కన ఉంది. దర్గాలో దర్శనం అనంతరం బయటకి వచ్చిన మనోజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. త్వరలో కొత్త జీవితం మొదలవుతుందని క్లారిటీ ఇచ్చాడు. అలాగే సినిమాలు కూడా ఇకపై గ్యాప్ లేకుండా వరుసగా చేస్తానని చెప్పారు. కొత్త సంవత్సరంతో తన జీవితంలో అన్ని కొత్తగా జరగబోతున్నాయి అంటూ స్పష్టం చేశారు. దీనిని బట్టి రాబోయే సంవత్సరం మౌనికా రెడ్డిని మనోజ్ పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతున్నారని అందరూ భావిస్తున్నారు.