ఇటు సినిమాలు, అటు రాజకీయాలు అంటూ రెండూ హ్యాండిల్ చేస్తూ శభాష్ అనిపించుకుంటున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. మెగా అభిమానులకు విజువల్ ట్రీట్స్ ఇచ్చేలా సినిమాలు ఎంపిక చేసుకుంటూ బిజీగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే కరోనా పరిస్థితుల తర్వాత ‘భీమ్లా నాయక్’ రూపంలో రఫ్ఫాడించేశారు పవన్. ఈ సినిమా లో మరో స్టార్ హీరో దగ్గుబాటి రానాతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఇద్దరూ పోటాపోటీ నటనతో భేష్ అనిపించారు. తొలి షోతోనే ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో థియేటర్ల వద్ద జాతర కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా కి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ విషయం బయటకొచ్చింది.
మళయాళ సూపర్ హిట్ సినిమా అయ్యప్పనుమ్ కోశియుమ్ రీమేక్గా భీమ్లా నాయక్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఇందులో పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్గా నటించారు.. డబ్బున్న పెద్ద ఫ్యామీలీ వ్యక్తి డానియల్ శేఖర్గా రానా నటించారు. కెమెరా ముందు ఇద్దరూ పోటీపడి నటించారని ఈ సినిమా చూసి వచ్చిన ప్రేక్షకుడి మాట. విడుదలకు ముందు రానా రోల్ పెద్దగా ఎలివేట్ చేయలేదు అనుకున్న సగటు ప్రేక్షకుడు సినిమా చూశాక ఆశ్చర్యపోయాడు.
చిత్రంలో పవన్, రానా స్క్రీన్ షేరింగ్ సమానంగా ఉంది. అదేవిధంగా పవన్ కళ్యాణ్- రానాల మధ్య వచ్చే కొన్ని ఫైట్ సీన్స్ వేంట్రుకలు నిక్కపొడిచాయి. అయితే ఇప్పుడు ఫిలిం నగర్లో వినిపిస్తున్న గాసిప్ ఏంటంటే.. డానియల్ శేఖర్ రోల్ కోసం ముందుగా మంచు విష్ణుని తీసుకోవాలని మేకర్స్ అనుకున్నారట. ఈ ఆఫర్ విష్ణు దాకా తీసుకెళ్లారట కానీ అదే సమయంలో మా ఎలెక్షన్స్ బిజీగా ఉండటంతో మంచు విష్ణు కాదన్నారని తెలుస్తోంది. దీంతో ఈ ఆఫర్ రానా చేతికి చిక్కిందనే విషయం నడుస్తోంది. ఏదేమైనా డానియల్ శేఖర్ పాత్రలో రానా ఒదిగిపోయిన తీరు అద్భుతం అని చెప్పాలి. ఇప్పుడు ఆ క్యారెక్టర్లో రానాను తప్ప ఇంకెవ్వరినీ ఊహించుకోవడం కష్టమే అని చెప్పాలి.. కానీ మంచు విష్ణుకి మాత్రం ఓ మంచి ఆఫర్ మిస్సయిందనే చెప్పుకోవాలి !!!