తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ ప్రస్థానం టీఆర్ఎస్ గా మొదలైంది. కేసీఆర్ జాతీయ రాజకీయాలపై దృష్టిపెట్టె ఉద్దేశ్యంతో భారతీయ రాష్ట్ర సమితిగా పార్టీ పేరు మార్చేశారు. అయితే బీఆర్ఎస్ పార్టీ లో ఉన్న అధినేత కేసీఆర్ నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలలో చాలా మంది టీడీపీ పార్టీ నుంచి రాజకీయ ప్రయాణం మొదలు పెట్టినవారే అనే సంగతి చాలా తక్కువ మందికి తెలుసు. కేసీఆర్ టీడీపీ హయాంలో మంత్రిగా కూడా పనిచేశారు. తరువాత ఆ పార్టీ నుంచి వేరుపడి టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేశారు. అలాగే ఎర్రబల్లి దయాకరరావు కూడా టీడీపీ నుంచి కీలక నేతగా ఎదిగి టీఆర్ఎస్ లోకి వచ్చినవాడే తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా టీడీపీ నుంచి వలన వచ్చిన నాయకుడే, నాగం జనార్ధన్ రెడ్డి ఇలా చాలా మంది నాయకులు టీడీపీలో రాజకీయ జీవితాన్ని మొదలు పెట్టి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో మంత్రుల స్థాయికి ఎదిగారు.
అయితే ఇప్పుడు అలాంటి నాయకులకి మళ్ళీ టీడీపీ నుంచి గండం ఉంటుంది అంటే ఎట్టి పరిస్థితిలో ఒప్పుకోరు. కాని కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీతో ఏపీలోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ వైసీపీతో జత కట్టి చంద్రబాబుని దెబ్బ తీయాలని ఆలోచిస్తున్నారు. ఈ నేపధ్యంలో చంద్రబాబు తెలంగాణలో ఫోకస్ పెట్టారు. అయితే చంద్రబాబు ఖమ్మంలో సమావేశం పెట్టేసరికి బీఆర్ఎస్ నాయకులు అందరూ మూకుమ్మడిగా అతనిపై ఎదురుదాడి మొదలు పెట్టారు. దీనికి కారణం కచ్చితంగా తమకి టీడీపీ నుంచి ఇబ్బంది అవుతుందని గ్రహించడం వలనే. ఇదే విషయాన్ని తెలంగాణ టీడీపీ చీఫ్ కాసాని జ్ఞానేశ్వర్ కూడా ప్రస్తావించడం విశేషం. చంద్రబాబు ఒక్క సభ పెట్టేసరికి బీఆర్ఎస్ పార్టీకి టెన్షన్ మొదలైందని విమర్శించారు.
బీఆర్ఎస్ పార్టీలో ఈ రోజు ఉన్న చాలా మంది ఎమ్మెల్యేలు, మంత్రులు టీడీపీలో ఓనమాలు నేర్చుకున్న వారే అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి అని అన్నారు. చంద్రబాబు తెలంగాణ అభివృద్ధిలో ఎంత కీలకంగా వ్యవహరించారో బీఆర్ఎస్ పార్టీలో ప్రతి ఒక్కరికి తెలుసని పేర్కొన్నారు. హైదరాబాద్ లో ఐటీ రంగం అభివృద్ధి, జీనోమ్ వ్యాలీ సృష్టికర్త చంద్రబాబు అని గతంలో కేసీఆర్, కేటీఆర్ ఒప్పుకున్నారని కాసాని గుర్తుచేశారు. టీడీపీ బలం చూసి బీఆర్ఎస్ పార్టీ భయపడి ఈ విమర్శలు చేస్తున్నట్లు అందరికి అర్ధమవుతుందని కాసాని విమర్శలు చేశారు. రానున్న రోజుల్లో తెలంగాణలో టీడీపీ మరింత బలం పుంజుకుంటుంది అని పేర్కొన్నారు.