ప్రస్తుతం స్టార్ హీరోలు ఆనందరూ పాన్ ఇండియా రేంజ్ లో తమ మార్కెట్ ని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా తమ సినిమాలని ఒక్క భాషకే పరిమితం కాకుండా వీలైనన్ని ఎక్కువ బాషలలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇప్పటికే సౌత్ నుంచి స్టార్ హీరోలు అందరూ కూడా పాన్ ఇండియా స్టార్స్ గా మారిపోయారు. అయితే బాలీవుడ్ హీరోలు మాత్రం సౌత్ మార్కెట్ పై చాలా కాలంగా ద్రుష్టి పెట్టిన ఆధిపత్యం సాధించలేక పోతున్నారు. కేవలం వారి హవా హిందీకి మాత్రమే పరిమితం అయ్యింది. అయితే సౌత్ హీరోల ఆధిపత్యం బాలీవుడ్ లో ఎక్కువ అయ్యింది.
ఈ నేపధ్యంలో బాలీవుడ్ హీరోలు కూడా సౌత్ పై ప్రత్యేక దృష్టి పెట్టారు. వారి కథల ఎంపిక కూడా మార్చుకుంటున్నారు. ఆడియన్స్ టేస్ట్ కి తగ్గ విధంగా కథలలో మార్పులు చేసుకుంటున్నారు. ఇక బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ హీరోగా లాల్ సింగ్ చద్దా అనే సినిమా తెరకెక్కింది. హాలీవుడ్ మూవీ ఫారెస్ట్ గంప్ రీమేక్ గా ఈ మూవీని తెరకెక్కించారు. అద్వైత్ చందన్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఇక ఈ మూవీలో టాలీవుడ్ యంగ్ స్టార్ నాగ చైతన్య కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు. కరీనాకపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమాని సౌత్ బాషలలో కూడా రిలీజ్ చేయడానికి అమీర్ ఖాన్ టీం ప్లాన్ చేసుకుంది.
ఇందులో భాగంగా సౌత్ లో ప్రమోషన్ పై దృష్టి పెట్టింది. ఈ సినిమాని తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సమర్పకుడుగా వ్యవహరిస్తూ ఉండటం విశేషం. మెగాస్టార్, అమీర్ ఖాన్ మధ్య మంచి స్నేహ సంబంధం ఉంది. ఈ నేపధ్యంలో అమీర్ ఖాన్ కి తెలుగులో మార్కెట్ క్రియేట్ చేసే బాద్యతని చిరంజీవి తీసుకున్నట్లు దీనిని బట్టి తెలుస్తుంది. తాజాగా ఈ సినిమా ప్రివ్యూని హైదరాబాద్ లో ప్రదర్శించారు. దీనికి చిరంజీవితో పాటు దర్శక దిగ్గజం రాజమౌళి కూడా హాజరయ్యారు. ఆగష్టు 11న ఈ సినిమా హిందీతో పాటు దక్షిణాది అన్ని బాషలలో రిలీజ్ కాబోతుంది. మరి సౌత్ ఆడియన్స్ ని ఈ మూవీ ఎంత వరకు ఆకట్టుకుంటుందో అనేది వేచి చూడాలి.