MLC Elections: ఏపీలో ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల వేడి నడుస్తుంది. ముఖ్యంగా ఈ ఎన్నికలని అధికార పార్టీ వైసీపీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మొత్తం అన్ని స్థానాలలో కూడా గెలిచి బలం నిరూపించుకోవాలని చూస్తుంది. అయితే ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువగా ఉండటం వలన ఉద్యోగుల ఎమ్మెల్సీ, అలాగే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలలో తమకి అనుకూలమైన ఫలితాలు వస్తాయని టీడీపీ భావిస్తుంది. అయితే వైసీపీ మాత్రం విస్తృతంగా ప్రచారం నిర్వహించడంతో పాటు అన్ని వర్గాల వారికి ప్రభుత్వం ఏ విధంగా అండగా ఉంటుంది అనే విషయాలని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మంత్రులకి ముఖ్యమంత్రి జగన్ బాద్యతలు అప్పగించడంతో వారంతా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.
ఇప్పటికే నామినేషన్ లు మొదలయ్యాయి. ఈ నేపధ్యంలో వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్ధులు అందరూ నామినేశంస్ వేశారు. ఇదిలా ఉంటే ఉత్తరాంద్రలో పట్టబద్రుల ఎమ్మెల్సీలో వైసీపీకి కాస్తా గట్టి పోటీ ఉంది. అక్కడ మొదటి నుంచి ఇండిపెండెంట్ గా నిలబడిన వారు గెలుస్తూ వస్తున్నారు. అయితే ఈ సారి వైసీపీ బలపరిచిన నాయకుడిని గెలిపించుకోవాలని చూస్తున్నారు. ఏది అలా గెలిస్తేనే విశాఖ రాజధాని అని చెబుతున్న మాటలకి బలం వస్తుందని, ఉత్తరాంధ్రలో చదువుకున్న వారంతా విశాఖని రాజధానిగా కోరుకుంటున్నారు అని చెప్పొచ్చు అని అనుకుంటున్నారు.
ఆ దిశగానే జగన్ వ్యూహాలు అమలు చేస్తున్నారు. ఇక ఎమ్మెల్సీ ఎన్నికలలో అన్ని స్థానాల్లో గెలిచి తమ బలం తగ్గలేదని నిరూపించుకోవాలని జగన్ చూస్తున్నారు. ప్రస్తుతం ఫలితాల సరళి కూడా అలాగే ఉండే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. మరి టీడీపీ ఏమైనా ప్రభుత్వ వ్యతిరేకతని తనకి అనుకూలంగా మార్చుకొని ఎమ్మెల్సీ అభ్యర్ధులని గెలిపించుకోగలుగుతుందా అనేది చూడాలి.