Nagababu : మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్కు మెగా బ్రదర్ నాగబాబు గుడ్ న్యూస్ చెప్పారు. ఈసారి మెగాస్టార్ పుట్టిన రోజును మరింత గ్రాండ్గా నిర్వహిస్తామని వెల్లడించారు. అలాగే మెగా అభిమానుల కోసం కార్నివాల్ నిర్వహించున్నట్టు వెల్లడించారు. ఇండియాలోనే ఏ హీరోకి కార్నివాల్ పెట్టలేదని.. అది చిరుకే దక్కిందని నాగబాబు వెల్లడించారు. గురువారం చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంకులో నిర్వహించిన ప్రెస్మీట్లో నాగబాబు ఆగస్ట్ 22న గ్రాండ్గా జరగబోయే చిరంజీవి పుట్టినరోజు కార్నివాల్ పోస్టర్ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘మా కుటుంబం మొత్తానికి అన్నయ్య తండ్రిలాంటి వ్యక్తి. ఆయన పుట్టినరోజంటే మా అందరికీ వేడుకలాంటిది. మా అందరి పుట్టినరోజు వేడుకలు సాధారణంగా జరిగినా అన్నయ్యది మాత్రం ఎప్పుడూ గ్రాండ్గా జరుగుతుంది.అభిమానుల ఆనందం కోసం ఈ సారి బర్త్డే కార్నివాల్గా నిర్వహిస్తున్నాం. ఈ వేదికపై చాలా సర్ప్రైజ్లు ఉంటాయి. ఏపీలో పొలిటికల్ ఎఫైర్స్ మీటింగ్ ఉండటంతో పవన్కల్యాణ్ దానికి హాజరు కావాల్సి ఉంది. కాబట్టి తాను ఈ వేడుకకు హాజరు కారు. అయితే అదే కార్యక్రమానికి నేను కూడా వెళ్లాలి. కానీ నేను ఈ వేడుకకు హాజరవుతా’’ అని నాగబాబు అన్నారు.
Nagababu : కార్నివాల్ ఫెస్టివల్ని హైటెక్స్లో ఏర్పాటు చేస్తున్నాం
ఇంకా నాగబాబు మాట్లాడుతూ.. ‘‘అన్నయ్యను అభిమానించే వాళ్లందరికీ ఆయన పుట్టిన రోజంటే పండుగలాంటి. ఆ వేడుకను ప్రతి ఏటా శిల్పకళావేదికలో చేసేవాళ్లం. బర్త్డే వేడుకల్లో అభిమానులు ప్రత్యక్షంగా పాల్గొని ఎంజాయ్ చేసే విధంగా ఈ ఏడాది కొత్తగా ప్లాన్ చేశాం. అభిమానుల కోసం కార్నివాల్ ఫెస్టివల్ని హైటెక్స్లో ఏర్పాటు చేస్తున్నాం. ఇండియాలో ఏ హీరోకి కార్నివాల్ లాంటిది పెట్టలేదు. అది అన్నయ్యకే దక్కింది. ఈ కార్నివాల్ ఫెస్టివల్ అనేది మెగా ఫ్యాన్స్కి ఒక జ్ఞాపకంగా ఉండాలి. చాలా ఊళ్లల్లో చిరంజీవి పుట్టినరోజును వేడుకలా చేసుకుంటారు. ఈ ఏడాది మరింత గ్రాండ్గా జరగనున్న కార్నివాల్లో అన్ని ప్రాంతాల అభిమానులు పాల్గొవాలి. కుదిరిన మేరకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సదుపాయాలు కార్నివాల్లో ఏర్పాటు చేస్తున్నాం. ఇతర హీరోలు, చిరంజీవిగారిని అభిమానించే వారు అందరూ ఈ ఫెస్టివల్లో పాల్గొంటారు. ఈ వేదికపై నేను మాడ్లాడేది నాలుగైదు నిమిషాలే అయినా అన్నయ్య గురించి ఎవరికీ తెలియని విషయాలు చెబుతాను. శుక్రవారం నుంచి ఎంట్రీ పాసులు బ్లడ్బ్యాంక్, జిల్లాల వారీగా అధ్యక్షుల దగ్గర అందుబాటులో ఉంటాయి’’ అని వెల్లడించారు.