Nandamuri Balakrishna: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఉన్న రెండు కుటుంబాలు ఒకటి నందమూరి కుటుంబం అయితే మరొకటి ఘట్టమనేని కుటుంబం. ఈ రెండు కుటుంబాల రెండో తరం వారసత్వాన్ని ప్రస్తుతం నందమూరి బాలయ్య, మహేష్ బాబులు కొనసాగిస్తున్నారు. మొన్నీ మధ్యనే సూపర్ స్టార్ కృష్ణ అనారోగ్యంతో మరణించగా.. అతడితో ముడిపడిన చాలా విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో బాలయ్య, మంజులతో తీయాలనుకున్న సినిమా గురించిన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఒకప్పుడు ఎన్టీఆర్, కృష్ణలు నువ్వా నేనా అన్నట్లు సినిమా ఇండస్ట్రీలో పోటీపడేవారు. ఎన్టీఆర్ తో కృష్ణ దాదాపు ప్రతి విషయంలోనూ విభేదించే వారు. అయితే వారిద్దరి మధ్య కోల్డ్ వార్ సాగుతోందనే విషయం అప్పట్లో అందరికీ తెలుసు.
ఇది ఇలా ఉండగానే కృష్ణ కూతురు, మహేష్ బాబు అక్క మంజులను సినిమా ఇండస్ట్రీలోకి లాంఛ్ చేయాలని అనుకున్నారట. అయితే నందమూరి బాలయ్యతో సినిమా కోసం ఆమెను హీరోయిన్ గా అనుకున్నారట. కానీ విషయం బయటకు రావడంతో కృష్ణ ఫ్యాన్స్ పద్మాలయ స్టూడియో ముందు ధర్నాకు దిగారట.
Nandamuri Balakrishna:
ఎన్టీఆర్ తో ఉన్న విభేదాల నేపథ్యంలో ఈ సినిమా వద్దని ఫ్యాన్స్ ధర్నా చేశారట. ఈ తలనొప్పిని గమనించిన కృష్ణ ఈ సినిమా చేయొద్దని మంజులతో అన్నాడట. దాంతో ఆమె కూడా పరిస్థితిని అర్థం చేసుకొని సినిమా నుండి వైదొలిగిందని అప్పట్లో వచ్చిన వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది.