Ashwani Dutt : చిత్ర పరిశ్రమలో మనకు తెలియని విషయాలు చాలా ఉంటాయి. అవి కొన్ని ఇంటర్వ్యూల్లోనో లేదంటే కొన్ని షోల్లోనో బయటకు వస్తాయి. వాటిని చూసి అవాక్కవుతూ ఉంటాయి. నిజానికి చాలా ఆసక్తికర విషయాలు ఎప్పుడో కానీ బయటకు రావు. అటు బాలీవుడ్లో అయితే ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్గా వస్తున్న ‘కాఫీ విత్ కరణ్’ షోతో స్టార్ హీరోలు, హీరోయిన్లకు సంబంధించిన ఎన్నో సీక్రెట్స్ బయటకు వస్తున్నాయి. ఇక తెలుగులో అయితే ప్రముఖ హాస్య నటుడు అలీ హోస్ట్ చేసిన సెలబ్రిటీ టాక్ షో, అలితో సరదాగాతో బయటకు వస్తున్నాయి. తాజాగా ఈ షోలో ప్రముఖ నిర్మాత అశ్వినీ దత్ సందడి చేశారు.
అశ్వినీదత్ ఈ షోలో చాలా విషయాలను పంచుకున్నట్టు తెలుస్తోంది. తాజాగా ఈ షోకి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలో ఎన్నో ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. అశ్వనీదత్ ఇటీవలే సీతారామం సినిమాను రూపొందించారు. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చాలా క్రితం అంటే దాదాపు కరోనాకు పూర్వం బాక్సాఫీస్ కళకళలాడటం చూశాం. ఇటీవల కేజీఎఫ్-2, ఆర్ఆర్ఆర్.. వీటి తర్వాత సీతారామం సినిమానే బాక్సాఫీస్ను కళకళలాడిస్తోంది. ఇంత పెద్ద హిట్ కొట్టిన అశ్వనీదత్ తాను తీసిన సినిమాలకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను ఆలీతో సరదాగా టాక్ షోలో పంచుకున్నారు.
Ashwani Dutt : కథ సిద్ధమయ్యాక ప్రభాస్ను హీరోగా అనుకున్నాం..
అశ్విని దత్.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన స్టూడెంట్ నెం:1 గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ సినిమా ఒక్క ఫోన్ కాల్తో ప్రభాస్ చెయ్యాల్సింది కాస్తా.. యంగ్ టైగర్ ఎన్టీఆర్కు షిఫ్ట్ అయ్యిందని చెప్పుకొచ్చారు. స్టూడెంట్ నెం:1 కథ సిద్ధమయ్యాక హీరో కోసం వెతుకులాటలో ఉన్నామని.. సినిమాకు ప్రభాస్ను ఎంపిక చేయాలని అనుకున్నామని చెప్పారు. కానీ దివంగత నటుడు హరికృష్ణ తనకు ఫోన్ చేసి జూనియర్ ఎన్టీఆర్ని ఎంపిక చేయమని అడిగారన్నారు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో కానీ మొత్తంగా సినిమాకు ఎన్టీఆర్ హీరో అయిపోయాడు. ఈ సినిమా ఎన్టీఆర్కు మంచి టర్నింగ్ పాయింట్ అనే చెప్పాలి.