Pavitra Lokesh : ఇటీవలి కాలంలో బాగా వార్తల్లో నిలిచిన వ్యక్తి పవిత్రా లోకేష్. సీనియర్ నటుడు నరేష్ను నాలుగో వివాహం చేసుకోబోతోందంటూ ప్రచారం జోరుగానే సాగింది. ఆమె కూడా ఇటీవలి కాలంలో ఎక్కడ కనిపించినా నరేష్తోనే కనిపించడం ఈ వార్తలకు బలం చేకూరినట్టైంది. ఈ విషయాన్ని నరేష్ మూడో భార్య మీడియా ఎదుట చెప్పి రచ్చ రచ్చ చేసింది. అంతేనా బెంగుళూరులోని ఓ హోటల్లో నరేష్, పవిత్ర ఉండగా.. రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. దీంతో ఈ విషయం మరింత చర్చనీయాంశంగా మారింది.
మొత్తంగా.. నరేష్, పవిత్రా లోకేష్, రమ్య రఘుపతి మధ్య గొడవలు తారాస్థాయికి చేరాయి. కానీ ఆ తరువాత ఏం జరిగిందో ఏమో కానీ ఆ ముగ్గురిలో ఎవరూ కూడా మీడియా ముందుకు రాలేదు. అంతా గప్.. చుప్.. అయిపోయారు. ఇక తాజాగా పవిత్రా లోకేష్ సడెన్గా మరోసారి వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. ఇది వీకే నరేష్ గురించి కాదులెండి. ఆమె రెమ్యూనరేషన్ విషయంలో. అసలే నరేష్ వ్యవహారంతో పవిత్రకు ఉన్న సినిమాలు కూడా వెనక్కి వెళ్లిపోయాయనే టాక్ నడిచింది. ఇక ముందు ఆమెను సినిమాల్లోకి తీసుకుంటారో.. లేదోనన్న క్లారిటీ కూడా లేదు.
Pavitra Lokesh : రెమ్యునరేషన్ను దాదాపు రెట్టింపు చేశారట..
అదీ కాదంటే.. ప్రస్తుతం నిర్మాతలంతా సమ్మెలో ఉన్నారు. దానికి ముఖ్య కారణంగా నటీనటుల రెమ్యూనరేషన్. నిర్మాతలు అందరూ ఏకమై నటీనటుల రెమ్యునరేషన్స్ విషయంలో కొన్ని నిర్ణయాలు తీసుకుని తగ్గించాలని అనుకుంటున్నారు. ఈ సమయంలో పవిత్రా లోకేష్ తన రెమ్యునరేషన్ను దాదాపు రెట్టింపు చేశారట. ఇది వరకు ఆమె రోజుకి అరవై వేల రూపాయల రెమ్యునరేషన్ను ఛార్జ్ చేసేవారట. కానీ ఇప్పుడు దాన్ని లక్ష రూపాయలు చేశారని టాక్. ఈ సమయంలో ఇంతలా రెమ్యూనరేషన్ను పెంచితే ఇక ఆమెకు సినిమా అవకాశాలు ఆవిరైపోయినట్టేనని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి దీనిపై పవిత్రా లోకేష్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.