పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. హరిహర వీరమల్లు షూటింగ్ చివరి దశకి వచ్చేసింది. ఈ నేపధ్యంలో ఇప్పటికే నిర్మాతలతో అగ్రిమెంట్ చేసుకొని ఉండటంతో రాజకీయాలలో బిజీగా ఉన్నా కూడా వరుసగా రెండు సినిమాలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు హరీష్ శంకర్ దర్శకత్వంలో సినిమా ఎప్పుడో ఒకే అయ్యింది. అయితే హరి హర వీరమల్లు షూటింగ్ తర్వాత స్టార్ట్ చేయాలని అనుకున్నారు. ఈ కారణంగా ఆ మూవీ ఆలస్యం అవుతూ వచ్చింది. ఇప్పుడు ఆ మూవీని సెట్స్ పైకి తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. ఇక తాజాగా హరీష్, పవన్ కళ్యాణ్ కలయికలో మూవీకి సంబంధించి మైత్రీ మూవీ మేకర్స్ కీలక అప్డేట్ ఇచ్చారు. గతంలో భవదీయుడు భగత్ సింగ్ అని పెట్టిన పేరుని ఉస్తాద్ భగత్ సింగ్ అని మార్చారు.
ఇక దీనికి ట్యాగ్ లైన్ గా మనల్ని ఎవడ్రా ఆపేది అనేది ఇచ్చారు. దీనిని బట్టి రాజకీయంగా ఈ మూవీ పవన్ కళ్యాణ్ ని పుష్ ఇచ్చేది అని తెలుస్తుంది. తమిళ్ హిట్ మూవీ తెరి లైన్ ని తీసుకొని ఈ కథని హరీష్ శంకర్ సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. జనవరిలో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్ళే ఛాన్స్ ఉందనే మాట వినిపిస్తుంది. అలాగే యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో కూడా మాఫియా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కబోతుంది.
ఇక ఈ సినిమా హై ఇంటెన్సన్ కాన్సెప్ట్ తోనే తెరకెక్కుతుంది. ఇక హరీష్ మూవీతో పాటు సుజిత్ సినిమాని కూడా ఒకే సారి స్టార్ట్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఇక వీలైనంత వేగంగా ఈ రెండు సినిమాలని పూర్తి చేసి తర్వాత పూర్తి స్థాయిలో రాజకీయాలపై పవన్ కళ్యాణ్ ఫోకస్ చేయనున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే రాజకీయ ప్రచారానికి కావాల్సిన వారాహి కూడా పవన్ కళ్యాణ్ సిద్ధం చేయించేసారు. ఈ నేపధ్యంలో బస్సుయాత్ర మొదలయ్యే లోపు ఈ సినిమాలని వీలైనంత వరకు పూర్తి చేయాలని భావిస్తున్నారు.