జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గత కొంత కాలం నుంచి ఏపీ రాజకీయాలలో చురుకుగా దూసుకెళ్తున్నారు. తాను ఓ వైపు ట్విట్టర్ ద్వారా ప్రభుత్వ వైఫల్యాలని ఎండగడుతూ విమర్శలు చేస్తూనే మరో వైపు ప్రతక్షంగా కూడా తరుచుగా ఏదో ఒక కార్యక్రమంతో ప్రజలలోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే కౌలు రైతుల భరోసా యాత్రకి ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. రాజకీయంగా ప్రజలోకి బలంగా వెళ్లేందుకు ఇది ఏందో ఉపయోగపడింది అనే మాట రాజకీయ వర్గాలలో బలంగా వినిపిస్తుంది. అది నడుస్తూ ఉండగానే మళ్ళీ గత వారం నుంచి జనవాణి పేరుతో ప్రజా సమస్యలు వినేందుకు ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దీనికి కూడా వినూత్న స్పందన వచ్చింది. వందలాది మంది తమ సమస్యలని విన్నవించుకోవడానికి ఎక్కడెక్కడి నుచ్చో వచ్చి జనసేనని కలిసే ప్రయత్నం చేస్తున్నారు.
రెండు ఆదివారాలు జనవాణికి అద్బుతమైన స్పందన రావడంతో మూడో ఆదివారం భీమవరం వేదికగా దీనిని నిర్వహించాలని నిర్ణయించారు. ఇప్పటికే దీనిపై స్పష్టత కూడా ఇచ్చేసారు. జనవాణి ద్వారా ప్రజా సమస్యల పరిష్కారానికి పవన్ కళ్యాణ్ భరోసా ఇవ్వడంతో ప్రజల నుంచి స్పందన భాగా వస్తుంది. దీనిని మరింతగా ప్రజలలోకి తీసుకెళ్లడానికి వెన్యూని పశ్చిమ గోదావరి జిల్లాకి మార్చారు. గోదావరి జిల్లాలో గత మూడేళ్ళలో జనసేన ఓటుబ్యాంకు గణనీయంగా పెరిగింది. ఈ నేపధ్యంలో ఆ ప్రాంత ప్రజలకి మరింత చేరువ అయ్యే వ్యూహంలో భాగంగా ఈ మూడో ఆదివారం వెన్యూని భీమవరానికి మార్చారని టాక్ వినిపిస్తుంది. గత ఎన్నికలలో పవన్ కళ్యాణ్ భీమవరం, గాజువాక నియోజకవర్గాలలో పోటీ చేశారు. అయితే భీమవరంలో కచ్చితంగా పవన్ కళ్యాణ్ గెలుస్తాడని అందరూ భావించారు. అయతే ఊహించని రీతిలో గాజువాకతో పాటు భీమవరంలో కూడా పవన్ ఓడిపోయారు. నిజంగా జనసేనానికి అది పెద్ద అవమానం అనే మాట రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది.
ఇప్పటికే వైసీపీ నాయకులు దీనినే సాకుగా చూపిస్తూ పవన్ పై విమర్శలు చేస్తున్నారు. ఈ సారి తాను పోటీ చేసే నియోజకవర్గంపై జనసేనాని ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. అయితే గోదావరి జిల్లాల నుంచే పవన్ పోటీ ఉంటుందని అందరూ భావిస్తున్నారు. ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లా నుంచి పోటీ ఉండే అవకాశం ఉంది. ఈ నేపధ్యంలో భీమవరంలో తన ప్రభావం ఎ స్థాయిలో ఉందో అంచనా వేసుకోవడంతో పాటు జిల్లాలో అన్ని నియోజకవర్గాలలో జనసేన బలంపై స్పష్టమైన అవగాహన కోసం ఈ జనవాణిని ఉపయోగించుకుంటున్నట్లు రాజకీయ వర్గాలలో వినిపిస్తున్న మాట. ప్రస్తుతం భీమవరంలో వైసీపీలో అంతర్గత కుమ్ములాటలు ఎక్కువయ్యాయి. నియోజకవర్గ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ కూడా మంత్రి పదవి ఆశించి అసంతృప్తితో ఉన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలలో కూడా చురుకుగా పాల్గొనడం లేదు ఈ నేపధ్యంలో జనసేన బలం భీమవరంలో పుంజుకునే అవకాశం ఉంటుందని, ఈ పవన్ అక్కడ పోటీ చేస్తే భారీ మెజారిటీతో గెలుపు గ్యారెంటీ అనే టాక్ కూడా వినిపిస్తుంది. మరి జనసేనాని వేస్తున్న వ్యూహాత్మక అడుగులు ఎలా ఉంటాయో అనేది త్వరలో నిర్ణయం అయిపోయే అవకాశం ఉంది.