ఏపీలో వైసీపీ మూడు ముక్కలాట ఆడుతుందని గతంలో పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలకి కొనసాగింపుగా తాజాగా రిపబ్లిక్ డే రోజు మరోసారి అధికార పార్టీపై విరుచుకుపడ్డారు. ఏపీలో ప్రత్యేక ఉత్తరాంధ్ర అంటూ కొంత మంది వైసీపీ నాయకులు విభజన వాదం తీసుకొస్తున్నారని అన్నారు. అదే సమయంలో రాయలసీమలో కూడా కొంతమంది పనిగట్టుకొని ప్రత్యేక రాయలసీమ అంటూ వాదనని తెరపైకి తీసుకొచ్చి రాజకీయాలు చేస్తున్నారని జనసేనాని విమర్శించారు. ఇలాంటి విభజన వాద రాజకీయాలు చేస్తున్న వైసీపీ నాయకులకి పవన్ కళ్యాణ్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. మీ రాజకీయ లబ్ది కోసం రాష్ట్రాన్ని విడగోట్టేస్తాం అని మాట్లాడుతారా? మీకు ఆ హక్కు ఎవరిచ్చారు. అసలు మీకు రాజ్యాంగం గురించి తెలుసా? పబ్లిక్ పాలసీ గురించి అవగాహన ఉందా? మీ బ్రతుకులంకేం తెలుసు అని ఇలా ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టె వ్యాఖ్యలు చేస్తున్నారు.
ఒక వేళ మీరు చేస్తే మేము చూస్తూ కూర్చుంటామా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి విభజన వాద రాజకీయాలు చేస్తూ ఆంధ్రాని మరోసారి విభాజిస్తాం అంటూ నాకంటే పెద్ద ఉగ్రవాది మరెవరూ ఉండరూ. మీకు ఎలా బుద్ధి చెప్పాలో అలాగే చెబుతాం అంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇంతకాలం మీరు చేసిన విభజన రాజకీయాలు చాలు. ఇక ఆపేయండి ఫైర్ అయ్యారు. ఇక జగన్ రెడ్డిపైన పవన్ కళ్యాణ్ తీవ్ర విమర్శలు చేశారు. యుక్తవయస్సులో ఉన్నప్పుడు వాళ్ల నాన్న అండ చూసుకొని ఓ ఎస్సైని జైల్లో పెట్టి కొట్టించిన వ్యక్తి ఇప్పుడు లా అండ్ ఆర్డర్ ని సాశించే స్థానంలో ఉన్నారు.
అలాంటి వ్యక్తిని మీరు నమ్మి పట్టం కట్టారు అంటూ విమర్శించారు. రాజకీయ నాయకులు మాట్లాడితే ప్రతిసారి నా ఎజెండా మార్చేస్తా అంటూ విమర్శిస్తున్నారు. అయితే ప్రజల అవసరం కోసం తాను ఎన్ని సార్లు అయినా, ఎన్ని విధాలుగా అయినా తన విధానాలు మార్చుకుంటా అని తెలిపారు. సమాజంలో మార్పు రావాలంటే ప్రజల ఆలోచనలని, అలాగే సామాజిక స్థితిగతులకి కరెక్ట్ గా అర్ధం చేసుకోవడంతోనే సాధ్యం అవుతుందని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.