నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా ఆహాలో చేస్తున్న అన్ స్టాపబుల్ టాక్ షో ఎంత సక్సెస్ అయ్యిందో అందరికి తెలిసిందే. సీజన్ 1కి మించిన ఆదరణ సీజన్ 2కి వస్తుంది. ఇక ఈ సారి సీజన్ లో సినీ ప్రముఖులతో పాటు రాజకీయ ప్రముఖులని కూడా ఆహ్వానించారు. దీంతో ఈ సారి బాలయ్య షో మరింత ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుని బాలయ్య ఇంటర్వ్యూ చేసి చాలా ఆసక్తికర విషయాలని పంచుకున్నారు. త్వరలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, గోపీచంద్ పాల్గొన్న ఎపిసోడ్ కూడా ప్రసారం కాబోతుంది. ఇప్పటికే ఈ ఎపిసోడ్ కి సంబందించిన ప్రోమో బయటకి వచ్చి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎప్పుడు కూడా టాక్ షోలో పార్టిసిపేట్ చేయని ప్రభాస్, గోపీచంద్ మొదటిసారి కలిసి బాలయ్య హోస్ట్ లో సందడి చేయనున్నారు. ఇక ఈ ఎపిసోడ్ కోసం ఫ్యాన్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అసలు ఈ షోలో బాలయ్య ప్రభాస్ ని ఎలాంటి ప్రశ్నలు అడగబోతున్నాడు అనేది వినాలని ఆసక్తి చూపిస్తున్నారు. అదే సమయంలో గోపీచంద్, ప్రభాస్ ఫ్రెండ్ షిప్ గురించి కూడా ఆసక్తికర విషయాలు పంచుకునే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే నెక్స్ట్ ఎపిసోడ్ కి సంబందించిన ఆసక్తికర అప్డేట్ ఇప్పుడు బయటకి వచ్చింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొదటి సారి టాక్ షోలో పాల్గొని బాలయ్య అదే ప్రశ్నలకి సమాధానం ఇవ్వడానికి రెడీ అయినట్లు తెలుస్తుంది. అన్ స్టాపబుల్ టీమ్ కి పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని, ఈ నేపధ్యంలో ఈ ఎపిసోడ్ షూటింగ్ కి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని తెలుస్తుంది.
ఇక ఆ ఎపిసోడ్ లో పవన్ కళ్యాణ్ తో పాటు త్రివిక్రమ్ శ్రీనివాస్ పార్టిసిపేట్ చేసే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. ఇక వీరి కలయికలో డిసెంబర్ 27న అన్ స్టాపబుల్ ఎపిసోడ్ ప్రసారం అయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. దీనికి సంబందించిన అప్డేట్ ని నిర్మాత నాగవంశీ కూడా ట్విట్టర్ లో కన్ఫర్మ్ చేశారు. పవన్ కళ్యాణ్, బాలయ్య బాబు ఒకే షోలో ఎదురెదురుగా కూర్చొని ఎలాంటి విషయాలు మాట్లాడుతారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక ఈ ఎపిసోడ్ కి అదిరిపోయే రేటింగ్స్ రావడం పక్కా అనే మాట కూడా వినిపిస్తుంది.