Rajasingh : గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్పై పోలీసులు పీడీ యాక్ట్ను పోలీసులు ప్రయోగించారు. నాటుసారా తయారీ–విక్రయం, మాదక ద్రవ్యాల అక్రమరవాణా–అమ్మకం, బందిపోటు దొంగతనాలు, మనుషుల అక్రమ రవాణా, భూ కబ్జాలు, గూండాయిజం.. ఈ తరహా నేరాలతో రెచ్చిపోతున్న వారిని నియంత్రించే ఉద్దేశంతో 1986లో పీడీ (ప్రివెంటివ్ డిటెన్షన్ (ముందస్తు నిర్బంధం) యాక్ట్ను అమల్లోకి తీసుకువచ్చారు. పోలీసు విభాగం పీడీ (ప్రివెంటివ్ డిటెన్షన్ (ముందస్తు నిర్బంధం) చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టం కింద ఓ ఎమ్మెల్యేను అదుపులోకి తీసుకోవడం.. జైలుకు పంపడం తెలుగు రాష్ట్రాల్లో అయితే ఇదే తొలిసారి.
ఓసారి వ్యక్తిని ఈ చట్టం కింద అదుపులోకి తీసుకుంటే.. ప్రభుత్వం ఆమోదిస్తే 12 నెలల పాటు ఎలాంటి విచారణ లేకుండా జైల్లోనే ఉంచవచ్చు. కాబట్టి రాజాసింగ్ను ఏడాది పాటు బయటకు రానివ్వకుండా పకడ్బందీగా స్కెచ్ గీసి ప్రభుత్వమే ఇలా ఇరికించిందంటూ చర్చ నడుస్తోంది. ఈ మేరకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగానే పీడీ యాక్టు నమోదు చేసినట్లు అందులో పేర్కొన్నారు. అనంతరం బెయిల్పై ఉన్న రాజాసింగ్ను మళ్లీ అరెస్టు చేశారు. రాజాసింగ్పై 2014 నుంచి ఇప్పటిదాకా 18 మతపరమైన కేసులు సహా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 101 క్రిమినల్ కేసులు నమోదయ్యాయని పోలీసులు వెల్లడించారు. గతంలో ఉన్న ఈ కేసులతో పాటు రౌడీషీట్ ఆధారంగా చేసుకొని ఆయనపై పీడీ యాక్టును ప్రయోగించినట్లు తెలిపారు.
Rajasingh : 3 నేరాల్లో కేసులు నమోదైన వారిపై పీడీ యాక్ట్ ప్రయోగిస్తారు..
నిజానికి నిర్ణీత కాలంలో మూడు నేరాలు చేసి కేసులు నమోదైన వారిపై ఈ యాక్ట్ ప్రయోగించే అవకాశం ఉంటుంది. దీనికి ఏదైనా పోలీస్ స్టేషన్కు చెందిన ఇన్స్పెక్టర్ ఈ తరహా నిందితులను గుర్తించి పీడీ యాక్ట్ ప్రయోగానికి ప్రతిపాదిస్తారు. దీన్ని ఏసీపీ సమీక్షించిన తర్వాత డీసీపీ ద్వారా కొత్వాల్కు చేరుతుంది. ఆయన పూర్వాపరాలు పరిశీలించాల్సిందిగా పీడీ సెల్ను ఆదేశిస్తారు. ఆ సెల్ ఓకే అని నివేదిక ఇస్తే, ఆ వ్యక్తికి నోటీసులు ఇచ్చి అదుపులోకి తీసుకుంటారు. ఒకవేళ అతను అప్పటికే జైల్లో ఉంటే అక్కడే ఇస్తారు.