కోలీవుడ్ అగ్ర కథానాయకుల్లో ఒకరైన అజిత్ లేటెస్ట్ చిత్రం ‘వలిమై’. ఈ సినిమా ఫిబ్రవరి 24న విడుదలైంది. టాలీవుడ్ స్టార్ కార్తికేయ ఇందులో విలన్గా నడిచారు. వలిమై విడుదలైన తర్వాత ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఈ సంబరాల్లో ఓ ఆపశ్రుతి చోటు చేసుకుంది. అసలు ఏం జరిగిందనే వివరాల్లోకి వెళితే..కోయంబత్తూరులోని గంగ వల్లి మల్టీప్లెక్స్లో అజిత్ వలిమై ఈ చిత్రం రిలీజ్ అయ్యింది. ఫ్యాన్స్ పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు.
అదే సమయంలో అనుకోకుండా ముగ్గురు దుండగులు థియేటర్లో పెట్రోల్ బాంబులతో దాడి చేయడం జరిగింది. ఈ దాడిలో ముగ్గురు అభిమానులకు తీవ్ర గాయాల పాలయ్యాడు . బైక్ వచ్చి సదరు దుండగులు బాంబులతో దాడి చేసిన వారిని పట్టుకోవడానికి అజిత్ అభిమానులు ప్రయత్నించారు. కానీ దుండగులు తప్పించుకుని పారిపోయారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని విచారణను చేసారు. ఇలా పెట్రోలు బాంబులతో సినిమా రిలీజ్ రోజున దాడి చేయడం అనేది అందరినీ విస్మయానికి గురి చేస్తోంది.
అజిత్ హీరోగా నటించిన వలిమై చిత్రంలో టాలీవుడ్ స్టార్ కార్తికేయ సైకో విలన్గా చేసారు. హ్యుమా ఖురేషి ప్రధాన పాత్రలో నటించారు. యాక్షన్ ప్రధానాంశంగా సాగే చిత్రం. బైక్ రేసింగ్ సన్నివేశాలు మెస్మరైజ్ చేస్తున్నాయని ఫ్యాన్స్ చెపుతున్నారు. ఇందులో అజిత్ పోలీస్ ఆఫీసర్గా చేశారు. జీ స్టూడియోతో కలిసి బే వ్యూ ప్రాజెక్ట్ బ్యానర్పై బోనీ కపూర్ ఈ సినిమాని నిర్మించారు. హెచ్.వినోద్ దర్శకుడు. తెలుగు, తమిళ, హిందీ బాషల్లో వలిమై సినిమా రిలీజ్ అయ్యింది. దాదాపు రెండేళ్ల తర్వాత అజిత్ హీరోగా నటించిన సినిమా విడుదల అయ్యడంతో ఫాన్స్ రెచ్చిపోతున్నారు.
అజిత్ తదుపరి చిత్రం కూడా హెచ్.వినోద్ దర్శకత్వంలోనే తెరకెక్కబోతుంది. వలిమై చిత్రాన్ని నిర్మించిన బోనీ కపూర్ ఈ సినిమాను కూడా నిర్మించబోతున్నారు.