‘బాహుబలి’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా క్రియేట్ చేసిన సెన్సేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు సినిమా రేంజ్ ఏంటో అందరికీ తెలిసిందే. ప్రభాస్ బాక్సాఫీస్ బాహుబలిగా మారిపోయారు. పాన్ ఇండియా స్టార్గా మారిపోయారు. అప్పటి నుంచి వరుసగా పాన్ ఇండియా సినిమాలనే చేస్తూ వస్తున్నారు. సాహో తర్వాత ఇప్పటి వరకు ప్రభాస్ సినిమా సిల్వర్ స్క్రీన్పై కనపడడం లేదు. అందుకు కరోనా కూడా ఓ కారణం చెప్పొచ్చు. మరో వైపు ప్రభాస్ ఫ్యాన్స్ ఆతృతంగా ఎదురు చూస్తున్నారు. ఇక వెయిటింగ్ చాలన్నట్లు అన్నీ కుదరడంతో ప్రభాస్ తన ఖాతాలో ఉన్న వాటిలో ముందుగా ‘రాధే శ్యామ్’ను రిలీజ్ సినిమా ను చేస్తున్నారు. మార్చి 11న ఈ పాన్ ఇండియా మూవీ ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ కాబోతుంది.
ఇక రిలీజ్కు సిద్ధమవుతున్న చిత్రాల్లో ప్రభాస్ పాన్ ఇండియా లిస్టు చాలా పెద్దగానే ఉంది. అందులో ఒక సినిమా ‘ఆది పురుష్’ ఒకటి. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ తో బిజీగా ఉంది. ఈ సినిమాను ఆగస్ట్ 11న విడుదల చేస్తామని చిత్ర యూనిట్ ముందుగా అనుకున్నారు. కానీ.. ఆమిర్ ఖాన్ ‘లాల్ సింగ్ చద్దా’ కోసం ‘ఆది పురుష్’ను వాయిదా వేశారు. అక్కడ ప్రభాస్ ఫ్యాన్స్ కాస్తంత నిరాశ పడ్డప్పటికీ తప్పలేదు మరి.
‘ఆది పురుష్’ సినిమాను టెక్నికల్ వండర్గా మలచడానికి డైరెక్టర్ ఓం రౌత్ అండ్ టీమ్ ఎంతో కష్టపడుతున్నారు. తాజాగా.. ఈ సినిమా గురించి డైరెక్టర్ రీసెంట్ ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలను చెప్పారు. ఇంతకీ అవేంటో తెలుసా!.. ఏడు వేల సంవత్సరాల క్రితం జరిగిన రామాయణంను నేటి ట్రెండ్కు తగ్గట్టు చెప్పబోతున్నారు .. అందులో ప్రభాస్ పేరు రామ్ కాదని, రాఘవ్ అని, అలాగే సీతగా నటించిన కృతి సనన్ పేరు జానకి అని, రావణాసురుడుగా నటించిన సైఫ్ అలీఖాన్ పేరు లంకేష్ అని చెప్పారు. మరి రిలీజ్ డేట్ చెబుతారనుకుంటే సస్పెన్స్లో పెట్టారు ఓం రౌత్.