Prasanth Kishore: వచ్చే లోక్ సభ ఎన్నికలలో బీజేపీదే మళ్ళీ అధికారం అని, ఇందులో ఎలాంటి సందేహం లేదని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ స్పష్టం చేశారు. విపక్షాలు అన్ని కూడా సొంత అజెండాతో ఎవరికి వారు అన్నట్లుగా బీజేపీతో ఫైట్ చేస్తున్నారని అయితే ఈ బలం వారిని ఓడించడానికి ఏ మాత్రం సరిపోదని తేల్చేశాడు. విపక్షాల మధ్య ఐక్యత లేనంత వరకు బీజేపీ దేశాన్ని పరిపాలిస్తూనే ఉంటుంది అని అన్నారు. విపక్షాల ఐక్యత అంటే కేవలం ఆయా పార్టీల నేతలు కలవడం మాత్రమేనని అన్నారు. బీజేపీని ఓడించాలంటే ముందుగా హిందుత్వ, జాతీయవాదం, సంక్షేమాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుందని అన్నారు.
వీటిలో రెండింటిని విపక్షాలు అర్ధం చేసుకున్న బీజేపీని ఓడించడం సాధ్యం అవుతుందన్నారు. హిందుత్వ సిద్దాంతంపై పోరాటం చేయాలంటే విపక్షాల సిద్దాంతాలు, భావజాలం కూడా కలవాలని ప్రశాంత్ కిషోర్ తెలిపారు. గాంధీవాది, అంబేద్కరైట్స్, సోషలిస్టులు, కమ్యూనిస్టులు… ఏదైనాసరే ఒంటరి సిద్దాంతాలతో ప్రజల నమ్మకాన్ని సాధించడం అంత ఈజీ కాదని చెప్పారు. తనది మహాత్మాగాంధీ భావజాలమని… బీహార్ లో తాను చేపట్టిన జన సూరజ్ యాత్ర లక్ష్యం కూడా గాంధీ కాంగ్రెస్ ను మళ్లీ తీసుకురావడానికి చేసే ప్రయత్నమేనని అన్నారు.
కాంగ్రెస్ పార్టీకి తాను పునర్జన్మను ఇవ్వాలని తాను అనుకుంటున్నానని, వారు ఎన్నికల్లో గెలవాలని అనుకుంటున్నారు అని అన్నారు. తన సలహాలు వినేందుకు వారు సిద్ధంగా లేరని అన్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఎన్నికల్లో ఏ స్థాయిలో ఫలితాలని అందిస్తుంది అనే విషయం అది ఎంత విజయవంతం అయ్యింది అనేది డిసైడ్ అవుతుందన్నారు. యాత్ర అంటే నడవడం మాత్రమే కాదని, ప్రజల సమస్యలని అర్ధం చేసుకోవడంతో పాటు బలమైన సిద్దాంతాలని ప్రజలలోకి తీసుకొని వెళ్ళడం అని పేర్కొన్నారు.