Puri Jagannadh: డాషింగ్ డైరెక్టర్ గా టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్న వ్యక్తి పూరి జగన్నాథ్. తెలుగు సినిమా హీరోల ఇమేజ్ ని పూర్తిగా మార్చేసి తనదైన శైలిలో ఎస్టాబ్లిష్ చేసిన దర్శకుడుగా పూరి జగన్నాథ్ చరిత్రలో కచ్చితంగా ఒక అధ్యాయం క్రియేట్ చేసుకున్నారని చెప్పాలి. రాముడు మంచి బాలుడు అనే తరహా పాత్రల నుంచి తెలుగు సినిమా బయటకు రావడంలో పూరి జగన్నాథ్ పాత్ర చాలా కీలకంగా ఉంది. ఆయన తెరకెక్కించిన బద్రి, ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి, శివమణి ఇలాంటి చిత్రాలు హీరోలు ఇమేజ్ ను పూర్తిగా మార్చేశాయి. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేసిన పోకిరి సినిమా ట్రెండ్ సెట్టర్ అని చెప్పాలి. అలాగే జూనియర్ ఎన్టీఆర్ తో చేసిన టెంపర్ సినిమా కూడా పూరి జగన్నాథ్ స్టైల్ ఆఫ్ మేకింగ్, క్యారెక్టరైజేషన్ కి ఒక నిలువుటద్దాం అని చెప్పొచ్చు.
చివరగా పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండ తో టైగర్ అనే సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కించి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. అయితే ఈ సినిమా డిజాస్టర్ టాక్స్ సొంతం చేసుకుని రెండో రోజు దియేటర్స్ ఖాళీ అయిపోయాయి. హిందీలో కొంతమేరకు పరవాలేదని టాక్ తెచ్చుకుంది. అయితే తెలుగులో పూరి జగన్నాథ్ ఇలాంటి రోటీన్ కథలను ఇప్పటికే చాలా సినిమాలలో చూపించేశారు. కథ, కథనంలో ఎలాంటి కొత్తదనం లేదని విమర్శలు ఎదుర్కొన్నారు. విజయ్ దేవరకొండ తన పెర్ఫార్మెన్స్ తో వంద శాతం న్యాయం చేసిన దర్శకుడిగా పూరి జగన్నాథ్ ఫెయిల్ అయ్యారనే అపవాదు మూట కట్టుకున్నారు. ఇదిలా ఉంటే లైగర్ తర్వాత మరల గ్రాండ్ గా ఎంట్రీ ఇవ్వాలని పూరి జగన్నాథ్ ప్రయత్నం చేసుకున్నారు. అందుకోసం ఇప్పటికే కథ కూడా సిద్ధం చేసుకున్నారు. మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలని ఆలోచన చేస్తున్నారు.
చిరంజీవి కూడా మంచి కథ సిద్ధం చేస్తే చేద్దామని మాట ఇవ్వడం విశేషం. అయితే పూరి జగన్నాథ్ చిరంజీవిని ఏ మేరకు తన కథతో మెప్పిస్తాడు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరోవైపు మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయడం కంటే ముందు ఒక బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకోవాలని పూరి జగన్నాథ్ ఆలోచిస్తున్నారు. అందుకోసం రామ్ పోతినేని తో ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ ప్లాన్ చేసే పనిలో ఉన్నట్లుగా ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్. రామ్ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు.
తన తను మాస్ హీరో మాస్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ఈ సినిమాని రామ్ పోతినేని చేస్తూ ఉండడం విశేషం. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో రం కి మాస్ అప్పీల్ తీసుకొచ్చింది పూరి జగన్నాథం చెప్పాలి. అప్పుడే ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుందని కూడా కన్ఫర్మ్ చేశారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పూరి జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ ప్లాన్ లో ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం పూరి జగన్నా థ్ ఇమేజ్ బట్టి కచ్చితంగా కథ నచ్చితేనే రామ్ సినిమా చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.